న్యూఢిల్లీ: గవర్నర్స్ కప్ బాక్సింగ్ టోర్నీలో భారత స్టార్, ప్రపంచ నంబర్వన్ అమిత్ పంగల్ (52 కేజీలు) సెమీఫైనల్ చేరాడు. రష్యా వేదికగా జరుగుతున్న టోర్నీ క్వార్టర్ ఫైనల్లో అమిత్ 5-0తో లోకల్ ప్లేయర్ తమిర్ గలనోవ్పై అలవోకగా గెలిచి కనీసం కాంస్యం ఖాయం చేసుకున్నాడు. కాగా తొలి రౌండ్లోనే ఓడిన భారత బాక్సర్లు మహమ్మద్ హుసాముద్దీన్ (57 కేజీలు), సుమీత్ సాంగ్వాన్ (81 కేజీలు), నమన్ తన్వర్ (91 కేజీలు), ఆశిష్ కుమార్ (75 కేజీలు), వినోద్ తన్వర్ (49 కేజీలు) టోర్నీ నుంచి నిష్క్రమించారు.