ఆంధ్రాకు అంబటి రాయుడు!

న్యూఢిల్లీ: దేశవాళీ క్రికెట్లో ఆంధ్రా జట్టు తరఫున ఆడేందుకు భారత సీనియర్ బ్యాట్స్మన్ అంబటి రాయుడు సిద్ధమయ్యాడు. హైదరాబాద్ క్రికెట్ అసోసియేషన్ (హెచ్సీఏ)తో తీవ్ర విభేదాల కారణంగా గతేడాది జట్టును వీడగా.. ఆంధ్రాకు వెళ్లేందుకు బీసీసీఐ అతడికి నిరభ్యంతర పత్రం(ఎన్వోసీ) ఇచ్చినట్టు బోర్డు అధికారి ఒకరు చెప్పారు. కరోనా వైరస్ విజృంభణ తర్వాత బీసీసీఐ నిర్వహించనున్న తొలి దేశవాశీ టోర్నీ సయ్యద్ ముస్తాక్ అలీ ట్రోఫీలో ఆంధ్రా తరఫున రాయుడు బరిలోకి దిగనున్నట్టు సమాచారం. మరో రెండు రోజుల్లో ఆంధ్రా క్రికెట్ సంఘం ఈ విషయంపై అధికారిక ప్రకటన చేసే అవకాశం ఉంది.
ఛత్తీస్గఢ్కు రవికిరణ్
హెచ్సీఏ నుంచి ప్లేయర్ల వలసల పరంపర కొనసాగుతున్నది. పేసర్ మాజేటి రవి కిరణ్ ఛత్తీస్గఢ్ తరఫున బరిలో దిగేందుకు సిద్ధమయ్యాడు. హైదరాబాద్ జట్టులో కీలక బౌలరైన రవికిరణ్ రానున్న సీజన్లో ఛత్తీస్గఢ్కు సేవలు అందించనున్నాడు.
తాజావార్తలు
- మహా శివరాత్రి కానుకగా `జాతి రత్నాలు`
- ఆత్మనిర్భర్ భారత్లో యూపీ కీలకం : మోదీ
- ‘రైతు ట్రాక్టర్లకు డీజిల్ సరఫరా నిలిపివేయండి..’
- కృష్ణుడ్ని కలువాలంటూ.. భవనం పైనుంచి దూకిన మహిళ
- ఢిల్లీలో హత్య.. సీసీ కెమెరాలో రికార్డు
- బొలెరో వాహనం బోల్తా.. వ్యక్తి దుర్మరణం
- బీజేపీతోనే అవినీతి నిర్మూలన : అమిత్ షా
- వరుణ్ధవన్ వెడ్డింగ్కు తారలు..ఫొటోలు, వీడియో
- ఈడబ్ల్యూఎస్ రిజర్వేషన్లు..అగ్రవర్ణాల పేదలకు వరం
- ఐపీఎల్-2021.. ఆ ముగ్గురిపైనే చెన్నై కన్ను