హైదరాబాద్ : మహబూబ్నగర్-రంగారెడ్డి-హైదరాబాద్ పట్టభద్రుల నియోజకవర్గ ఎన్నికలో ఎమ్మెల్సీగా ఎన్నికైన టీఆర్ఎస్ పార్టీ అభ్యర్థి వాణీదేవికి మంత్రి హరీశ్రావు అభినందనలు తెలిపారు. ట్విట్టర్ ద్వారా మంత్రి స్పందిస్తూ.. ప్రజలు సీఎం కేసీఆర్ పక్షాన ఉన్నారని మరోసారి నిరూపితమైందన్నారు. టీఆర్ఎస్ పార్టీకి మద్దతు తెలిపిన పట్టభద్రులందరికి మంత్రి కృతజ్ఞతలు తెలిపారు. అభ్యర్థి విజయం కోసం కష్టించి పనిచేసిన పార్టీ కార్యకర్తలకు, నాయకులకు ధన్యవాదాలు తెలిపారు.
మంత్రి గంగల కమలాకర్ స్పందిస్తూ వాణీదేవి విజయం పట్ల హర్షం వ్యక్తం చేశారు. వాణీదేవిని ఆశీర్వదించిన పట్టభద్రులకు, విజయానికి తోడ్పడ్పాడ్డరంటూ టీఎన్జీవో, ఇతర సంఘాలకు కృతజ్ఞతలు చెప్పారు. మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ మాట్లాడుతూ.. రాష్ట్రంలో జరుగుతున్న అభివృద్ధి చూసి పట్టభద్రులు టీఆర్ఎస్ అభ్యర్థికి ఓటేశారన్నారు. రాష్ట్రం వచ్చాక ప్రభుత్వ, ప్రైవేటు ఉద్యోగాలు ఇచ్చినట్లు తెలిపారు. ప్రతి రౌండ్లో తమకు స్పష్టమైన మెజారిటీ వచ్చిందన్నారు. ఏ నమ్మకంతో తమ పార్టీ అభ్యర్థికి ఓటేశారో ఆ నమ్మకాన్ని నిలబెట్టుకుంటామని పేర్కొన్నారు.