హైదరాబాద్, నమస్తే తెలంగాణ ఆట ప్రతినిధి: అంతర్జాతీయ ఒలింపిక్ కమిటీ (ఐవోసీ) అథ్లెట్ బ్రాండ్ అంబాసిడర్గా ఎంపికైన ప్రపంచ చాంపియన్, భారత స్టార్ షట్లర్ పీవీ సింధును రాష్ట్ర క్రీడా ప్రాధికార సంస్థ (సాట్స్) చైర్మన్ అల్లిపురం వెంకటేశ్వరరెడ్డి అభినందించారు. అంతర్జాతీయ స్థాయిలో లెక్కకు మిక్కిలి విజయాలు సాధించినా.. నిత్యవిద్యార్థిలా క్రమశిక్షణతో మెలిగే సింధు.. తెలుగు రాష్ర్టాల క్రీడాకారులకు కీర్తి ప్రతిష్ఠలు తీసుకొచ్చారని అల్లిపురం పేర్కొన్నారు. బుధవారం గచ్చిబౌలి బ్యాడ్మింటన్ స్టేడియంలో సింధును కలిసిన ఆయన పుష్పగుచ్చంతో సత్కరించారు. ఈ కార్యక్రమంలో సాట్స్ కోచ్ రాజగోపాలాచారి, గోకుల్, రమేశ్, సాయి తదితరులు పాల్గొన్నారు.