హైదరాబాద్, ఆట ప్రతినిధి: హైదరాబాద్ ఓపెన్ టెన్నిస్ అసోసియేషన్(హెచ్వోటీఏ) ఆధ్వర్యంలో తాన్లా ఆలిండియా సీనియర్ ఓపెన్ టెన్నిస్ చాంపియన్షిప్ శనివారం మొదలైంది. అజీజ్నగర్లోని లేక్వ్యూ టెన్నిస్ అకాడమీలో ‘నీసా’ డైరెక్టర్, అడిషనల్ డీజీపీ సీవీ ఆనంద్ ముఖ్య అతిథిగా పాల్గొని పోటీలను ప్రారంభించారు. మూడు రోజుల పాటు జరుగనున్న టోర్నీలో నిర్వాహకులు రూ.2లక్షల ప్రైజ్మనీని ప్రకటించారు.