మోర్తాడ్, మోర్తాడ్(కమ్మర్పల్లి), మే16 : కరోనా పాజిటివ్ కేసులు, లక్షణాలు కలిగిన వారు ఎక్కువగా ఉన్న గ్రామాలపై దృష్టి సారించాలని రాష్ట్ర రోడ్లు భవనాలు, గృహ నిర్మాణ, శాసనసభా వ్యవహారాల శాఖ మంత్రి వేముల ప్రశాంత్రెడ్డి అధికారులకు సూచించారు. కమ్మర్పల్లి మండల కేంద్రం తోపాటు బషీరాబాద్, మోర్తాడ్లో పలు కుటుంబాలతో ఆదివారం సర్వే గురించి అడిగి తెలుసుకుని, అధికారులతో సమీక్షలు నిర్వహించారు. గ్రా మాల్లో ఇప్పటికే ఇంటింటి సర్వేలో కిట్లను ఇచ్చారని, వారి ఆరోగ్య పరిస్థితిపై ప్రతి రోజూ సమీక్షించాలన్నారు. ఈ విషయాలపై ఎంపీడీవో, తహసీల్దార్లు ప్రత్యేకంగా దృష్టి సారించాలని చెప్పారు. అదే విధంగా ఎంపీపీలు, జడ్పీటీసీలు, టీఆర్ఎస్ మండల అధ్యక్షులు ఈ గ్రామాలపై దృష్టి సారించి కరోనా స్థితిగతులను సమీక్షించాలని చెప్పారు. చౌట్పల్లి పీహెచ్సీకి ప్రత్యేకాధికారిని నియమించాలని ఆర్డీవో శ్రీనివాసులు, డీఎల్పీవో శ్రీనివాస్కు మంత్రి సూచించారు. చౌట్పల్లి పీహెచ్సీకి సంబంధించి కరోనా విషయంలో వైద్యాధికారి అప్రమత్తంగా లేడని స్పష్టమయ్యిందని, మహమ్మారి విజృంభిస్తున్న ఇటువంటి పరిస్థితుల్లో ఏమాత్రం నిర్లక్ష్యం వద్దని వెంటనే చౌట్పల్లి పీహెచ్సీకి ప్రత్యేకాధికారిని ఏర్పాటు చేయాలన్నారు.
సర్వేలో వార్డుసభ్యులు పాల్గొనేలా చూడాలి
ఇంటింటి సర్వేతో కరోనాను కట్టడి చేసే అవకాశా లు ఉన్నాయని మంత్రి డీఎల్పీవోను ఆదేశించా రు. ఇప్పటికే ఆశ వర్కర్లు సర్వేను పకడ్బందీగా చే శారని అభినందించారు. ఇంటింటి సర్వేకు మరోమారు వెళ్లినప్పుడు ఇంట్లో ఉన్న వారందరి ఆరో గ్య పరిస్థితులను తెలుసుకోవాలని, అందుకోసం వార్డు సభ్యులను వెంట తీసుకెళ్లాలని చెప్పారు.
లాక్డౌన్, సర్వేలతోనే కట్టడి
లాక్డౌన్ను పకడ్బందీగా అమలు చేయడం, ఇంటింటి సర్వేతో కరోనాను కట్టడి చేయవచ్చని మంత్రి వేముల ప్రశాంత్రెడ్డి అధికారులకు సూచించారు. లాక్డౌన్ విషయంలో కఠినంగా వ్యవహరించాలని, అదే విధంగా ఇంటింటి సర్వేను కూడా పకడ్బందీగా నిర్వహించేలా చర్యలు తీసుకోవాలన్నారు.
ఫలించిన మంత్రి ప్రయత్నం
కరోనా మహమ్మారితో పేద మధ్యతరగతి ప్రజలు ఇబ్బందుల పాలు కావద్దన్న ఉద్దేశంతో సీటీ స్కాన్కు రూ. 2వేలు మాత్రమే తీసుకోవాలని శనివారం జిల్లాలోని సీటీస్కాన్ సెంటర్ యజమానులతో మంత్రి వేముల ప్రశాంత్రెడ్డి కోరగా అందుకు వారు అంగీకరించారు. కరోనా బారిన పడిన వారిలో వ్యాధి తీవ్రతను గుర్తించేందుకు సీటీస్కాన్ తప్పనిసరి కావడంతో ఇది పేద, మధ్య తరగతి ప్రజలకు భారంగా మారింది. ఈ విషయంపై ఆదివారం సీటీ స్కాన్ సెంటర్ యాజమాన్యాలతో సమావేశాన్ని నిర్వహించి మాట్లాడాలని కలెక్టర్, డీఎంహెచ్వోలకు సూచించిన నేపథ్యంలో రూ.2 వేలకే సీటీ స్కాన్ చేసేందుకు యాజమాన్యాలు అంగీకరించాయి. దీంతో కరోనా బారినపడ్డ ఎంతో మంది పేద, మధ్యతరగతి ప్రజలకు మంత్రి ద్వారా సహకారం లభించినట్లయ్యింది. ఈ విషయం తెలుసుకున్న మంత్రి వేముల ప్రశాంత్రెడ్డి కలెక్టర్కు ఫోన్ చేసి అభినందనలు తెలిపారు. కార్యక్రమాల్లో ఎంపీడీవోలు శ్రీనివాస్రెడ్డి, సంతోష్రెడ్డి, తహసీల్దార్లు శ్రీధర్, బావయ్య, ఎంపీపీలు గౌత మి, శ్రీనివాస్, జడ్పీటీసీ బద్దం రవి, సర్పంచులు స్వామి, ధరణి, టీఆర్ఎస్ మండల అధ్యక్షులు ఏలియా, రేగుంట దేవేందర్, వైస్ఎంపీపీ శ్రీనివాస్, కల్లెం అశోక్, బద్దం రాజేశ్వర్, చిన్నారెడ్డి, రమేశ్, ఆనంద్, సత్యనారాయణ, మోత్కు భూ మన్న, గంగారెడ్డి, చిన్నరాజేశ్వర్, జేసీ గంగారెడ్డి, రాజ్పాల్, దడివె నవీన్, ఇంతియాజ్ పాల్గొన్నారు.