‘లవ్ ఫెయిల్యూర్’తో తెరంగేట్రం చేసిన మలయాళీ భామ ఐశ్వర్య మేనన్. ఒకే సినిమాతో తమిళ, తెలుగు ప్రేక్షకుల మనసులను గంపగుత్తగా దోచుకుంది. ఎందరో అభిమానులను సంపాదించుకుంది. సోషల్ మీడియాలో యాక్టివ్గా ఉంటూ, హాట్ పిక్స్తో యువత కండ్లలో థౌజెండ్ వాట్స్ బల్బులు వెలిగిస్తున్నది.
ఐశ్వర్య తమిళనాడులో పెరిగింది. మూలాలు మాత్రం కేరళలోనే ఉన్నాయి. దీంతో తమిళం, మలయాళం అనర్గళంగా మాట్లాడుతుంది. ఇన్స్ట్రుమెంటల్ ఇంజినీరింగ్ చేసిన ఈ భామ అనుకోకుండా మోడలింగ్లోకి వచ్చింది. బాగా చదివి సక్సెస్ఫుల్ బిజినెస్ ఉమెన్గా ఎదగాలని కలలుగన్నా నటిగా మారి, అభిమానులను అలరిస్తున్నది.
మోడలింగ్ చేస్తూనే 2012లో సిద్ధార్థ్ హీరోగా తమిళ తెరకు పరిచయమైంది. తెలుగులో ‘లవ్ ఫెయిల్యూర్’ పేరుతో డబ్ అయిన ఈ సినిమాలో నటనకుగానూ ఐశ్వర్యకు మంచి మార్కులే పడ్డాయి. మొదటి సినిమాతోనే అందం, అభినయం ఉన్న నటిగా దక్షిణాది ప్రేక్షకుల మనసులు దోచింది.
‘లవ్ ఫెయిల్యూర్’ తర్వాత ఐశ్వర్యకు తెలుగులో అంతగా అవకాశాలు రాలేదు. తమిళ, కన్నడ, మలయాళ సినిమాలతో ఎంతో కొంత నిలదొక్కుకుంది. తొలినాళ్ళలోనే చాలెంజింగ్ పాత్రలను ఎంచుకుంటూ ప్రత్యేక గుర్తింపును తెచ్చుకుంది. కన్నడంలో నటించిన మొదటి సినిమాలో మతిస్థిమితం లేని ‘అక్షర’ అనే అమ్మాయి పాత్ర పోషించి ప్రశంసలందుకుంది.
టాలీవుడ్లో రెండో సినిమాకే బంపర్ ఆఫర్ కొట్టేసి ‘వీర’ సినిమాలో రవితేజతో ఆడి పాడింది. 2018లో వచ్చిన తమిళ సినిమాలో మూడు భిన్నమైన పాత్రలను పోషించి ఔరా అనిపించింది. ప్రస్తుతం
తమిళంలో భారీ ప్రాజెక్టుగా తెరకెక్కుతున్న ‘వెజమ్’లో నటిస్తున్న ఈ భామ, మరోసారి ‘ఖిలాడీ’ రవితేజతో జత కట్టనున్నది.
సోషల్ మీడియా అభిమానుల మనసెరిగి ప్రవర్తిస్తున్నది ఐశ్వర్య. సినిమాలు ఉన్నా లేకున్నా ఎప్పటికప్పుడు తన కబుర్లను అభిమానులకు చేరవేస్తూనే ఉంటుంది. ఠంచనుగా వెకేషన్ ఫొటోలు షేర్ చేస్తుంది. అంతేకాదు, హాట్ హాట్ లుక్స్ పిక్స్తో కుర్రకారు మతి పోగొడుతున్నది ఈ అందాల భామ. అందుకే, ఐశ్వర్య ఫాలోవర్ల సంఖ్య ఇప్పటికే రెండు మిలియన్లు దాటిపోయింది.
దక్షిణాదిన మంచి అవకాశాలు అందుకుంటున్నా ఐశ్వర్య చూపు ఎప్పుడూ బాలీవుడ్పైనే. పైపెచ్చు, ఉత్తరాది భామలకు ఏ మాత్రం తీసిపోకుండా అందాల ఆరబోతలో ముందుంటున్నది. చీర కట్టులో
మెరవాలన్నా, మోడ్రన్ డ్రెస్సులో దుమారం లేపాలన్నా ఐశ్వర్యకే చెల్లుతున్నది. ఈ అందాల భామ ‘ఖిలాడీ’తో టాలీవుడ్ ప్రేక్షకులను మరెంతగా అలరిస్తుందో చూడాలి మరి!