టోక్యో ఒలింపిక్స్లో పసిడి పతకంతో భారత్ తలెత్తుకునేలా చేసిన జావెలిన్ త్రోయర్ నీరజ్ చోప్రా శ్రమకు గుర్తింపునిచ్చేందుకు భారత అథ్లెటిక్స్ సమాఖ్య (ఏఎఫ్ఐ) ప్రత్యేక నిర్ణయం తీసుకున్నది. ఆయన స్ఫూర్తిగా మరింత మంది యువత జావెలిన్ త్రో ఆటలో చేరుతారనే ఆశతో ఏఎఫ్ఐ ఈ నిర్ణయం తీసుకున్నది. 13 ఏండ్ల తర్వాత బంగారు పతకాన్ని ఒడిసిపట్టుకున్న నీరజ్ చోప్రా.. 121 ఏండ్ల తర్వాత ఒలింపిక్స్లో ట్రాక్ అండ్ ఫీల్డ్ ఈవెంట్లో బంగారు పతకం సాధించిన తొలి వ్యక్తిగా నిలిచారు.
టోక్యో ఒలింపిక్స్ను విజయవంతంగా ముగించి భారతదేశానికి తిరిగివచ్చిన క్రీడాకారులను కేంద్ర క్రీడా మంత్రిత్వ శాఖ ఘనంగా సన్మానించింది. ఈ సందర్భంగా గతంలో భారతదేశం తరఫున ఒలింపిక్స్లో పతకాలు సాధించిన పలువురు క్రీడాకారులు సైతం ఈ కార్యక్రమానికి హాజరయ్యారు. ఈ సందర్భంగా భారత అథ్లెటిక్స్ సమాఖ్య గొప్ప నిర్ణయం తీసుకున్నది. నీరజ్ చోప్రా పసిడి పతకాన్ని అందుకున్న రోజుకు గుర్తింపుగా ఇకపై ప్రతి ఏటా ఆగస్ట్ 7 వ తేదీని జావెలిన్ త్రో దినోత్సవంగా (Javelin Throw Day) జరుపుకోనున్నారు. ఈ విషయాన్ని అథ్లెటిక్స్ ఫెడరేషన్ ఆఫ్ ఇండియా ప్రణాళిక సంఘం చైర్మన్ లలిత్ భానోత్ సోమవారం రాత్రి సన్మానసభాముఖంగా వెల్లడించారు. ఈ నిర్ణయంతో రానున్న రోజుల్లో జావెలిన్ త్రో క్రీడకు భారత్లో మంచి రోజులు వస్తాయని, మరింత యుతత ఈ గేమ్తో కనెక్ట్ అవడానికి ప్రేరణగా నిలుస్తుందని ఆశిస్తున్నట్లు ఆయన చెప్పారు.
నెట్ఫ్లిక్స్తో చేతులు కలిపిన సంజయ్లీలా భన్సాలీ
వీరి నివాసం కేరాఫ్ పోలీస్ స్టేషన్..!
నీరజ్ చోప్రా ‘పసిడి’ రహస్యమిదే..?!
శ్రీనగర్లో రాహుల్గాంధీ పర్యటన
అంతరిక్షంలో వరుడు.. టెక్సాస్లో వధువు.. వీడియో కాల్లో పెండ్లి
రక్తంలో షుగర్ నియంత్రణకు కృత్రిమ క్లోమం
తాజా వార్తల కోసం నమస్తే తెలంగాణ ఫేస్బుక్ , ట్విటర్, టెలిగ్రామ్ ను ఫాలో అవండి..