సిద్దిపేట అర్బన్, ఏప్రిల్ 7 : కొవిడ్ లక్షణాలు ఉన్న వారిని ప్రత్యేకంగా పర్యవేక్షణ చేసి, జిల్లాలో కొవిడ్ మరణాలు లేకుండా చూడాలని వైద్యాధికారులను జిల్లా కలెక్టర్ వెంకట్రామ్రెడ్డి ఆదేశించారు. సిద్దిపేట కలెక్టరేట్ కార్యాలయంలో బుధవారం సెకెండ్ వేవ్ కరోనా విజృంభిస్తున్న దరిమిలా చేపట్టాల్సిన చర్యలపై అడిషనల్ కలెక్టర్ ముజామ్మిల్ఖాన్, డీఎంహెచ్ఓ మనోహర్, జిల్లా వైద్య ఆరోగ్య శాఖ అధికారులతో సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ ప్రభుత్వ ఆదేశాల మేరకు ప్రతి రోజు 300 ఆర్టీపీసీఆర్ పరీక్షలు, 3 వేల ర్యాపిడ్ టెస్టులు చేయాలని సూచించారు. మే నెలఖారు వరకు ప్రజలు అప్రమత్తంగా ఉండాలని కోరారు. జిల్లాలో 5 వెహికిల్స్ ద్వారా అన్ని పీహెచ్సీ కేంద్రాల్లో ఆర్టీపీసీఆర్ టెస్టులు చేసుకున్న తరువాత వైద్యాధికారులు, క్షేత్రస్థాయి వైద్యబృందం పాజిటివ్ సోకిన వ్యాధిగ్రస్తులపై ప్రత్యేక దృష్టి కేంద్రీకరించాలన్నారు.
ఈ మేరకు బుధవారం జిల్లాలో 590 పాజిటివ్ కేసులు ఉన్నాయని జిల్లా వైద్యాధికార బృందం సమీక్షలో వెల్లడించింది. అనంతరం జిల్లాలోని వైద్యాధికారులతో కలెక్టర్ టెలి కాన్ఫరెన్స్ నిర్వహించి మే నెలాఖరు వరకూ అప్రమత్తంగా ఉండాలని సూచించారు. హెల్త్కేర్ వర్కర్లు, ఫ్రంట్లైన్ వర్కర్లు, దీర్ఘకాల వ్యాధిగ్రస్తులు వ్యాక్సిన్ వేసుకునేలా అవగాహన కల్పించాలన్నారు. ఈ కార్యక్రమంలో డీఐవో విజయ, వైద్యాధికారులు పవన్, రజినీ, వెంకటేశ్, కార్తీక, రాధిక తదితరులు పాల్గొన్నారు. కాగా, ఈ నెల 11న తుది ఓటర్ జాబితా ప్రచురిస్తామని, ఓటర్ జాబితాలో ఏవైనా అభ్యంతరాలు ఉంటే 9వ తేదీ లోపు తెలపాలని కలెక్టర్ అన్నారు. సమీకృత కలెక్టరేట్ కార్యాలయ సమావేశ మందిరంలో మున్సిపల్ ఎన్నికల ప్రక్రియ ప్రారంభమైన నేపథ్యంలో కలెక్టర్ రాజకీయ పార్టీల అధ్యక్షతన ఆల్ పార్టీ సమీక్ష నిర్వహించారు.
ఇవీ కూడా చదవండీ…
కార్పొరేటర్ మందడిని పరామర్శించిన మంత్రి
మహారాష్ట్రలో ఒక్కరోజే 60వేల కేసులు
అల్లు అర్జున్ పేరు మార్చిన సుకుమార్..