విశాఖపట్నం: ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం విశాఖపట్నం జిల్లాలోని మాడుగుల గ్రామంలో ఆదివారం సాయంత్రం 12 అడుగుల పొడవున్న ఓ గిరినాగు కలకలం రేపింది. కొత్త అమావాస్య సందర్భంగా ప్రజలంతా నూకాలమ్మ కాలనీలో నూకాలమ్మ జాతరలో వుండగా స్థానికంగా ఓ ఇంటి గోడ వెంబడి గిరినాగు ప్రత్యక్షమైంది. దాంతో ఆ దారిలో గుంపులుగా వెళ్తున్న జనం భయంతో పరుగులు తీశారు.
వెంటనే తూర్పు కనుమల వన్యప్రాణి సంరక్షణ కేంద్రానికి సమాచారం ఇవ్వడంతో చోడవరం ఫారెస్టు రేంజర్ రామ్ నరేష్ బిర్లాంగి మాడుగులకే చెందిన స్నేక్ క్యాచ్చర్ వెంకటేశ్తో కలిసి ఘటనా ప్రాంతానికి వచ్చారు. వెంకటేశ్ గిరి నాగును పట్టుకొని తాటిపర్తి పంచాయతీ శివారులోని అటవీ ప్రాంతంలో వదిలేశారు. గిరి నాగులు చూడటానికి భయంకరంగా ఉంటాయని, కానీ ఎలాంటి హాని చేయవని అటవీ అధికారులు తెలిపారు.
లోకల్ టు గ్లోబల్ వార్తల కోసం.. నమస్తే తెలంగాణ ఫేస్బుక్, ట్విటర్ పేజీలను ఫాలో అవ్వండి
ఇవికూడా చదవండి..
టీకాలే లేకుండా టీకా ఉత్సవ్ ఎలా.. ప్రధానికి ముఖ్యమంత్రుల లేఖలు..!
దారితప్పి బావిలోపడ్డ ఏనుగుపిల్ల.. రక్షించిన అధికారులు.. వీడియో
ఇరాన్ అణు కేంద్రంపై సైబర్ దాడి !
కాబోయే భర్త రమ్మన్నాడు.. ఆ తర్వాత హత్య
ఇంట్రెస్టింగ్గా ఉన్న ఖిలాడి టీజర్