పుణె : భారత తొలి తరం బ్యాడ్మింటన్ దిగ్గజం నందు నటేకర్ బుధవారం మృతి చెందారు. ఈ విషయాన్ని ఆయన కుమారుడు, మాజీ టెన్నిస్ ఆటగాడు డేవిస్ గౌరవ్ వెల్లడించాడు. మహారాష్ట్రకు చెందిన నటేకర్ (88) వృద్ధాప్య సమస్యలతో మరణించారని గౌరవ్ తెలిపాడు. నటేకర్ 1956లో మలేషియాలోని కౌలాలాంపూర్లో జరిగిన సెలంగర్ అంతర్జాతీయ టోర్నమెంట్లో విజయం సాధించారు. నటేకర్ మృతి పట్ల ప్రధాని మోదీ సంతాపం ప్రకటించారు.