గువాహటి: టోక్యో ఒలింపిక్స్లో కాంస్యం సాధించిన స్టార్ బాక్సర్ లవ్లీనా బొర్గోహైకు అస్సాం ముఖ్యమంత్రి హిమాంత బిశ్వశర్మ.. డీఎస్పీ పోస్ట్ ఆఫర్ చేశారు. బాక్సింగ్లో కాంస్య పతకం నెగ్గిన తర్వాత తొలిసారి గువాహటికి వచ్చిన లవ్లీనాకు రాష్ట్ర ప్రభుత్వం గురువారం సన్మాన కార్యక్రమం ఏర్పాటు చేసింది. ఇందులో పాల్గొన్న సీఎం బిశ్వశర్మ.. లవ్లీనాను అస్సాం పోలీసు శాఖలో చేరాలని కోరారు. ఆమెకు కోటి రూపాయల నగదు ప్రోత్సాహకంతో పాటు పారిస్(2024) ఒలింపిక్స్ దాకా ఆర్థిక సాయం కింద నెలకు లక్ష రూపాయలు అందజేయనున్నట్టు తెలిపారు. అంతేగాక గువాహటిలోని ఓ రోడ్డుకు, గోల్గాట్లో రూ.25 కోట్లతో నిర్మించే స్పోర్ట్స్ కాంప్లెక్స్కూ లవ్లీనా పేరు పెడతామని సీఎం హామీ ఇచ్చారు. రాష్ట్రంలో ప్రతిభ కల్గిన క్రీడాకారులకు తాను సాయం చేస్తానని లవ్లీనా తెలిపింది.