న్యూఢిల్లీ: ప్రపంచ యూత్ బాక్సింగ్ చాంపియన్షిప్లో భారత బాక్సర్ల జోరు కొనసాగుతున్నది. పోలండ్ వేదికగా జరుగుతున్న టోర్నీలో ఏడుగురు భారత బాక్సర్లు సెమీఫైనల్లోకి ప్రవేశించి కనీసం కాంస్య పతకాలు ఖాయం చేసుకున్నారు. క్వార్టర్స్లో బేబిరోజిసనా చాను(51కి) 5-0తో అలెక్సస్ కుబికా(పోలండ్)పై గెలువగా, అరుంధతి చౌదరి(69కి) 5-0తో అన్నా సెజ్కో(ఉక్రెయిన్)పై, సనామచా చాను(75కి) 5-0తో మార్గరిటా జువా(అర్మేనియా)పై విజయాలు సాధించారు. మరోవైపు పురుషుల క్వార్టర్స్లో సచిన్(56కి) 3-2తో దిల్షాద్ అబ్దుముర్దోవ్(ఉజ్బెకిస్థాన్)పై, అంకిత్ నార్వల్(64కి) 5-0తో ఇజెక్విల్ డ క్రజ్(బ్రెజిల్)పై, విశాల్ గుప్తా(91కి) 3-2తో అమ్రోవ్(కజకిస్థాన్)పై గెలిచి టోర్నీలో ముందంజ వేశారు. టోర్నీ మొత్తంగా భారత్కు ఇప్పటి వరకు 11 పతకాలు ఖరారయ్యాయి.