పోలీసులకు అప్పగించిన న్యాయస్థానం
న్యూఢిల్లీ: స్టార్ రెజ్లర్ సుశీల్ కుమార్ను 6 రోజులు పోలీస్ కస్టడీకి అప్పగిస్తూ న్యాయస్థానం ఉత్తర్వులు జారీ చేసింది. ఈ నెల 4న దేశ రాజధానిలోని ఛత్రాసాల్ స్టేడియంలో సాగర్ రాణా హత్యకు గురికాగా.. ఈ ఘటనతో సంబంధం ఉందని భావిస్తున్న సుశీల్ కుమార్ అప్పటి నుంచి పోలీసుల కండ్లుగప్పి తిరిగాడు. ఎట్టకేలకు ఆదివారం ముండ్కా ప్రాంతంలో సుశీల్ను అదుపులోకి తీసుకున్న పోలీసులు రోహిణి కోర్టులో ప్రవేశ పెట్టారు. పూర్తి విచారణ కోసం పోలీసులు సుశీల్ను 12 రోజుల కస్టడీకి కోరగా.. అరగంట పాటు వాదనలు విన్న అనంతరం మెట్రోపాలిటన్ మెజిస్ట్రేట్ దివ్య మల్హోత్ర ఆరో రోజులు కస్టడీకి ఇస్తున్నట్లు ప్రకటించారు. సుశీల్తో పాటు ఈ ఘటనలో హస్తం ఉందని భావిస్తున్న అజయ్ కుమార్ను కూడా పోలీసులు న్యాయస్థానం ముందు హజరుపరిచారు.
ఒలింపిక్స్లో భారత్ తరఫున రెండు వ్యక్తిగత పతకాలు సాధించిన సుశీల్ను పోలీసుల అదుపులో చూడటం బాధగా ఉందని క్రీడాలోకం వాపోయింది. అంతర్జాతీయ స్థాయిలో పలుమార్లు త్రివర్ణ పతాకాన్ని రెపరెపలాడించిన సుశీల్.. ఒలింపిక్స్లో రెండు పతకాలతో పాటు.. కామన్వెల్త్ గేమ్స్లో మూడు స్వర్ణాలు, ప్రపంచ చాంపియన్షిప్లో ఓ పసిడి, ఆసియా క్రీడల్లో ఓ కాంస్యం, ఆసియా చాంపియన్షిప్లో 4 పతకాలు సాధించాడు. ఈ ఘటనపై ఇప్పుడే స్పందించడం తొందరపాటే అవుతుందని స్టార్ బాక్సర్ విజేందర్ పేర్కొంటే.. రెజ్లింగ్తో పాటు యావత్ క్రీడాలోకంపై దీని ప్రభావం ఉంటుందని టేబుల్ టెన్నిస్ (టీటీ) ప్లేయర్ శరత్ కమల్ అన్నాడు.