రెండో టెస్టుకు ప్రేక్షకులకు అనుమతి

న్యూఢిల్లీ: క్రీడా పోటీలకు మైదానాలు, స్టేడియాల్లో 50 శాతం మంది ప్రేక్షకులకు అనుమతినిస్తూ కేంద్ర ప్రభుత్వం నూతన మార్గదర్శకాలు విడుదల చేసిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలోనే భారత్, ఇంగ్లాండ్ మధ్య చెన్నై వేదికగా జరిగే రెండో టెస్టుకు 50శాతం ప్రేక్షకులను స్టేడియంలోకి అనుమతించాలని బీసీసీఐ, తమిళనాడు క్రికెట్ అసోసియేషన్(టీఎన్సీఏ) నిర్ణయించాయి. కొత్తగా కొవిడ్-19 మార్గదర్శకాలు విడుదల కావడంతో స్టేడియంలోకి ఫ్యాన్స్ను అనుమతించే విషయంపై అసోసియేషన్ సభ్యులు బీసీసీఐ అధికారులతో చర్చించారు. మ్యాచ్ కవరేజీకి మీడియా ప్రతినిధులను కూడా అనుమతించనున్నారు.
భారత్, ఇంగ్లాండ్ జట్ల మధ్య తొలి టెస్టు శుక్రవారం నుంచి ఆరంభంకానుండగా రెండో టెస్టు ఫిబ్రవరి 13న మొదలవనుంది. ఐతే మూడు, నాలుగు టెస్టులకు ఆతిథ్యమిచ్చే అహ్మదాబాద్ స్టేడియంలోకి ప్రేక్షకులను అనుమతిస్తామని ఇప్పటికే నిర్ణయం తీసుకున్నారు.
తాజావార్తలు
- వాలంటీర్లపై ఎస్ఈసీ ఆంక్షలు
- అల్లం రసాన్ని మనం రోజూ తీసుకోవాల్సిందే.. ఎందుకో తెలుసా..?
- ప్రియావారియర్ కు ఫస్ట్ మూవీనే ‘చెక్’ పెట్టిందా..!
- బెంగాల్లో బీజేపీ కార్యకర్త తల్లిపై దాడి
- మల్లన్న దర్శనం..పులకరించిన భక్తజనం
- 'Y' మోషన్ పోస్టర్ విడుదల
- హాట్ టాపిక్గా యోయో హనీసింగ్ 'షోర్ మచేగా' ..
- సర్జరీ చేస్తూనే ఆన్లైన్ కోర్టు విచారణలో పాల్గొన్న డాక్టర్
- మేడారంలో కరోనా కలకలం.. రేపటి నుంచి గుడి మూసివేత
- ప్రధాని మోదీకి గులాంనబీ ఆజాద్ ప్రశంసలు