అయిజ, మే 20 : అక్రమంగా నిల్వ ఉంచిన 240 కేజీల పత్తి విత్తనాలను పోలీసులు పట్టుకున్న ఘటన గురువారం చోటు చేసుకున్నది. ఎస్సై జగదీశ్వర్ కథనం మేరకు.. గురువారం ఉదయం మున్సిపాలిటీ పరిధిలోని తుపత్రాల గ్రామంలో కుర్వ చిన్న వీరన్న ఇంట్లో అక్రమంగా నాలుగు బస్తాలు (240 కేజీలు) లూజు పత్తి విత్తనాలు నిల్వ చేశాడన్నారు. మేడికొండ గ్రామానికి చెందిన హసన్భాష ఇంట్లో ఉండాల్సిన పత్తి విత్తనాలు వీరన్న ఇంట్లో ఉండడంతో విత్తనాలను స్వాధీనం చేసుకుని పోలీస్స్టేషన్కు తరలించామని ఎస్సై పేర్కొన్నారు. ఏవో శంకర్లాల్కు సమాచారం ఇవ్వగా ఆయన పత్తి విత్తనాలను పరిశీలించి, శాంపిల్స్ సేకరించి పరీక్షల నిమిత్తం హైదరాబాద్కు తరలించారని తెలిపారు. పత్తి విత్తనాలు కలిగి ఉన్న వీరన్నపై ఏఈవో పవన్కుమార్ ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు జరుపుతున్నట్లు ఎస్సై పేర్కొన్నారు.