పుణె: మహారాష్ట్ర పోలీసులు 33 మంది క్రికెట్ బుకీలను అరెస్టు చేశారు. ఇంగ్లండ్, ఇండియా మధ్య పుణెలో రెండవ వన్డే సమయంలో ఆ బుకీలు బెట్టింగ్కు పాల్పడ్డారు. మూడు బృందాలుగా మారిన పోలీసులు.. వేర్వేరు ప్రదేశాల్లో దాడులు చేసి బుకీలను పట్టుకున్నారు. మహారాష్ట్ర క్రికెట్ అసోసియేషన్ స్టేడియంలో జరుగుతున్న మ్యాచ్ను కొందరు మూడు ప్రదేశాల్లో ఉండి.. లైవ్లో బైనాక్యులర్ల ద్వారా వీక్షించారు. హై రెజల్యూషన్ కెమరాలను వాళ్లు వినియోగించినట్లు తెలుస్తోంది. మద్యప్రదేశ్కు చెందిన అయిదుగురు, హర్యానాకు చెందిన 13 మంది, మహారాష్ట్రకు చెందిన 11 మంది, రాజస్థాన్కు చెందిన ఇద్దర్ని అరెస్టు చేశారు. వారి వద్ద నుంచి 45 లక్షల నగదును, 74 మొబైల్ ఫోన్లను స్వాధీనం చేసుకున్నారు. మూడు ల్యాప్టాప్లు, 8 హై రెజల్యూషన్ కెమెరాలు, బైనాకులర్, విదేశీ కరెన్సీలను కూడా సీజ్ చేశారు. హై స్కోరింగ్ రెండవ వన్డేలో ఇంగ్లండ్ జట్టు ఈజీ విక్టరీ కొట్టిన విషయం తెలిసిందే. ఆదివారం ఇంగ్లండ్, భారత్ మధ్య చివరి వన్డే జరగనున్నది.