ఆర్మూర్, ఆగస్టు 25: ఈనెల 29న భారత హాకీ దిగ్గజం ధ్యాన్చంద్ జయంతిని పురస్కరించుకొని లయన్స్క్లబ్ ఆఫ్ నవనాథపురం ఆర్మూర్ ఆధ్వర్యంలో 2కె రన్ నిర్వహిస్తున్నట్లు నిర్వాహకులు బుధవారం తెలిపారు. క్లబ్ అధ్యక్ష, కార్యదర్శులు శివరాజ్కుమార్, బిజ్జు సంతోష్, కోశాధికారి చావ్లా మాట్లాడుతూ.. కార్యక్రమాన్నిఆర్మూర్ మున్సిపల్ పరిధిలో ఏర్పాటు చేస్తున్నట్లు పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో యువకులు అధిక సంఖ్యలో పాల్గొని విజయవంతం చేయాలని పిలుపునిచ్చారు.
ప్రోగ్రాం కన్వీనర్లుగా పీఈటీ మ్యాక మోహన్దాస్, గట్టడి నితిన్కుమార్ వ్యవహరిస్తారని, ఆర్మూర్లోని అంబేద్కర్ చౌరస్తా నుంచి మామిడిపల్లి వరకు తిరిగి మామిడిపల్లి నుంచి అంబేద్కర్ చౌరస్తా వరకు రన్ నిర్వహించనున్నట్లు వెల్లడించారు. కార్యక్రమం అనంతరం విజేతలకు సన్మానం చేయనున్నట్లు ఈ సందర్భంగా తెలిపారు.