హైదరాబాద్ : కరోనాపై ఆందోళన వద్దు. ఆ మహమ్మారిని ధైర్యంగా ఎదుర్కొందామని పంచాయతీ రాజ్ శాఖ మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు ప్రజలకు పిలుపునిచ్చారు. జనగామ జిల్లా పాలకుర్తి నియోజకవర్గంలోని పాలకుర్తి, కొడకండ్ల, దేవరుప్పుల, పెద్దవంగర, తొర్రూరు, రాయపర్తి మండలాల్లోని కరోనా బాధితులు, వారి కుటుంబ సభ్యులు, ప్రజా ప్రతినిధులు, అధికారులతో మంత్రి శుక్రవారం టెలీ కాన్ఫరెన్స్ నిర్వహించారు.
ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ.. మీకు మరీ ఇబ్బందులు అనిపిస్తే నాకు గానీ, నా వద్ద పని చేసే సిబ్బందికి గానీ ఫోన్ చేయాలని సూచించారు. బాధితుల యోగ క్షేమాలు, అందుతున్న వైద్యం, తీసుకుంటున్న జాగ్రత్తలను మంత్రి అడిగి తెలుసుకున్నారు.
వ్యాధి సోకిన వారు ఆందోళన చెందాల్సిన పనిలేదు. తగిన జాగ్రత్తలు తీసుకుంటే తగ్గిపోతుందని భరోసా కల్పించారు. ప్రజాప్రతినిధులు బాధితులకు అండగా నిలువాలని మంత్రి సూచించారు.
ఇవి కూడా చదవండి..
కరోనాతో జూనియర్ అసిస్టెంట్ మృతి
కోతలను బట్టి కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు చేయాలి
కేటీఆర్ త్వరగా కోలుకోవాలి : మంత్రి ఐకే రెడ్డి
రాష్ట్రం సుభిక్షంగా ఉండాలని లక్ష పుష్పార్చన
టీఆర్ఎస్ నుంచి కుడా డైరెక్టర్ చిర్ర రాజు బహిష్కరణ