సిరికొండ, మే 29: కరోనా బారినపడిన తెలంగాణ జాగృతి నిజామాబాద్ రూరల్ కన్వీనర్ మల్లెల సాయిచరణ్ను ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత శనివారం ఫోన్ ద్వారా పరామర్శించారు. ప్రస్తుత ఆరోగ్య పరిస్థితిని అడిగి తెలుసుకున్నారు. అధైర్యపడొద్దని, తాను అండగా ఉంటానని కుటుంబసభ్యులకు భరోసా కల్పించారు. కొవిడ్ సోకిన వెంటనే దవాఖానలో చేర్పించి మెరుగైన వైద్యం అందించిన ఎమ్మెల్సీ కవితకు సాయిచరణ్ కృతజ్ఞతలు తెలిపారు.