టోక్యో: ప్రపంచ చాంపియన్, తెలుగు షట్లర్ పీవీ సింధు ఒలింపిక్స్ సమరానికి సిద్ధమైంది. ఆదివారం మహిళల సింగిల్స్ గ్రూప్-జే తొలి పోరులో సెనియా పోలికర్పోవా (ఇజ్రాయెల్)తో ఆరో సీడ్ సింధు తలపడనుంది. రియోలో రజతం సాధించిన ఈ తెలుగమ్మాయి.. టోక్యోలో స్వర్ణ పతకమే లక్ష్యంగా పెట్టుకుంది. చెయింగ్ యీ కూడా ఉన్న గ్రూప్ జేలో టాప్లో నిలిచి సింధు ముందడుగేయడం సులభం కావడంతో.. ఆమెకు ప్రిక్వార్టర్స్లో మియా బ్లెచ్ఫీల్డ్ ఎదురుకావొచ్చు. సెమీస్ వరకు చేరితే టాప్ సీడ్ తై జూ యింగ్తో సింధు తలపడే అవకాశం ఉంటుంది.