దుబాయ్: ఆసియా యూత్ బాక్సింగ్ చాంపియన్షిప్లో భారత బాక్సర్ల జోరు కొనసాగుతున్నది. దుబాయ్ వేదికగా జరుగుతున్న ఈ టోర్నీలో మరో ముగ్గురు బాక్సర్లు ఫైనల్కు దూసుకెళ్లారు. శుక్రవారం రాత్రి జరిగిన సెమీఫైనల్ బౌట్లలో విశ్వామిత్ర (51 కేజీలు), సురేశ్ విశ్వనాథ్ (48 కేజీలు), జైదీప్ రావత్ (57 కేజీలు) విజయాలు సాధించారు. విశ్వామిత్ర 5-0తో అకరాలి అబ్దురఖీవొనజొడా (తజకిస్థాన్)పై గెలుపొందగా.. సురేశ్ 5-0తో సయ్యద్ (బహ్రెయిన్)ను చిత్తు చేశాడు. హోరాహోరీగా సాగిన మరో పోరులో జైదీప్ 3-2తో మురస్బెకావ్ (కజకిస్థాన్)పై నెగ్గాడు.