న్యూఢిల్లీ: ఐఎస్ఎస్ఎఫ్ షూటింగ్ ప్రపంచకప్లో భారత షూటర్ల పతకాల గురి కొనసాగుతున్నది. గురువారం ఇక్కడి కర్ణిసింగ్ రేంజ్లో జరిగిన మహిళల 25 మీటర్ల పిస్టల్ టీమ్ విభాగంలో మన జట్టు స్వర్ణ పతకాన్ని కైవసం చేసుకుంది. చింకీ యాదవ్, మనూ బాకర్, రాహి సర్ణోబత్తో కూడిన భారత త్రయం ఫైనల్లో 17- 7తో జొన్నా ఇవోనా, బొరెక్, అగ్నీస్జ్కా (పొలాండ్)ను చిత్తుచేసి టాప్లో నిలిచింది. మరోవైపు మహిళల 50 మీటర్ల రైఫిల్ 3 టీమ్ ఈవెంట్లో భారత షూటర్లు అంజుమ్, శ్రేయ, గాయత్రి రజతం దక్కించుకున్నారు. కాగా టోర్నీలో 10 స్వర్ణాలు, ఆరు రజతాలు, ఐదు కాంస్యాలతో మొత్తం 21 పతకాలు సాధించిన భారత్ పట్టికలో అగ్రస్థానంలో కొనసాగుతున్నది.