హైదరాబాద్ సిటీబ్యూరో, ఏప్రిల్ 16(నమస్తే తెలంగాణ): ఐపీఎల్ మ్యాచ్ల బెట్టింగ్ కొత్త పుంతలు తొక్కుతున్నది. పోలీసులకు ఎలాంటి అనుమానం రాకుండా ఉండేందుకు బెట్టింగ్ రాయుళ్లు..స్టార్ హోటళ్లను అడ్డాగా చేసుకుంటున్నారు. గతానికి భిన్నంగా పోలీసులకు దొరకకుండా బెట్టింగ్ నిర్వహిస్తూ డబ్బులు ఆర్జిస్తున్నారు. కరోనా వైరస్ అంతకంతకూ విస్తరిస్తుండటంతో బయటకు వెళ్లేందుకు కొంతమంది జంకుతున్నారు. దీన్ని ఆసరాగా చేసుకుని యాప్లు, ఫోన్లతో బెట్టింగ్ నిర్వహిస్తున్నారు. పోలీసుల కట్టుదిట్టమైన చర్యలతో పాత స్థావరాలకు వెళ్లేందుకు నిర్వాహకులు భయపడుతున్నారు.
ఇవీ కూడా చదవండీ…
కరోనా వ్యాప్తి నివారణకు కృషి చేయాలి
పూర్తిగా కరోనా చికిత్సకే గాంధీ!