చెన్నై చెపాక్ స్టేడియం వేదికగా జరుగుతున్న రెండో టెస్ట్ మ్యాచ్లో భారత్ పీకల్లోతు కష్టాలలో పడింది. రెండో ఓవర్లోనే శుభ్మన్ గిల్ డకౌట్గా వెనుదిరగగా, రోహిత్ శర్మ(80), పుజారా(21) రెండో వికెట్కు 85 పరుగుల విలువైన భాగస్వామ్యం నెలకొల్పారు. అయితే లీచ్ వేసిన బంతిని సరిగా అర్ధం చేసుకోలేక స్లిప్లో క్యాచ్ ఇచ్చి వెనుదిరిగాడు పుజారా. ఆ తర్వాత వచ్చిన కోహ్లీ(0) .. మొయిన్ అలీ బౌలింగ్లో క్లీన్ బౌల్డ్ అయ్యాడు. దీంతో భారత్ 86 పరుగులకు మూడు వికెట్లు కోల్పోయింది.
లంచ్ సమయానికి భారత్ మూడు వికెట్ల నష్టానికి 106 పరుగులు చేయగా ప్రస్తుతం క్రీజులో రోహిత్ శర్మ.( 80 బ్యాటింగ్: 78 బంతుల్లో 13×4, 1×6), అజింక్యా రహానే( 5) ఉన్నారు. వీరిద్దరు మరో కీలక భాగస్వామ్యం చేయని పక్షంలో ఇండియా కష్టాలను ఎదుర్కోవడం ఖాయంగా కనిపిస్తుంది. ఈ మ్యాచ్లో రోహిత్ శర్మ దూకుడుగా ఆడుతూ టెస్ట్లలో 12వ శతకాన్ని నమోదు చేయగా, ఆయన దూకుడుకు కళ్లెం వేసేందుకు రూట్ పలు ప్రయత్నాలు చేస్తున్నాడు.