హైదరాబాద్, ఆట ప్రతినిధి: ప్రపంచ బ్యాడ్మింటన్లో ప్రముఖ అంపైర్గా పేరు తెచ్చుకున్న వేమూరి సుధాకర్ కరోనాతో మంగళవారం కన్నుమూశారు. మూడు ఒలింపిక్స్ల్లో అంపైర్గా విధులు నిర్వర్తించిన సుధాకర్ ఆసియా టెక్నికల్ కమిటీ డిప్యూటీ చైర్మన్గా వ్యవహరించారు. బ్యాడ్మింటన్ ప్రపంచం ఒక మార్గదర్శిని కోల్పోయిందని జాతీయ చీఫ్ కోచ్ పుల్లెల గోపీచంద్, జాతీయ హ్యాండ్బాల్ ఫెడరేషన్(హెచ్ఎఫ్ఐ) అధ్యక్షుడు జగన్మోహన్రావు దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. ఆయన మృతి దేశ బ్యాడ్మింటన్కు తీరని లోటని విచారం వ్యక్తం చేశారు. తెలుగు రాష్ర్టాల్లో బ్యాడ్మింటన్ అభివృద్ధికి ఎనలేని కృషి చేసిన సుధాకర్ ఆత్మకు శాంతి చేకూరాలని గోపీచంద్, జగన్మోహన్రావు ప్రార్థించారు.