సిద్దిపేట : జిల్లాలోని దుబ్బాక బాలాజీ దేవాలయంలో మెదక్ ఎంపీ కొత్త ప్రభాకర్ రెడ్డి దంపతులు ప్రత్యేక పూజలు చేశారు. ప్రభాకర్ రెడ్డి దంపతులకు అర్చకులు ఘన స్వాగతం పలికారు. తీర్థ ప్రసాదాలు అందజేశారు. కాగా, రేపు ఆలయంలో జరగనున్న వెంకటేశ్వర స్వామి విగ్రహ ప్రతిష్ట మహోత్సవం కార్యక్రమానికి ఆలయం సిద్ధమైంది. విద్యుత్ కాంతులతో ఆలయం మెరిసిపోతున్నది. భక్తులకు ఎలాంటి ఇబ్బందులు రాకుండా ఆలయ వర్గాలు తగు ఏర్పాట్లు చేశాయి.
ఇవి కూడా చదవండి..
వ్యాక్సిన్ తీసుకున్న వారిలోనూ డెల్టా వేరియంట్ వ్యాప్తి!
విషాదం : కాన్పుకోసం వచ్చి మహిళ మృతి
పొంగిపొర్లుతున్న పొచ్చెర జలపాతం
Khammam : వైభవంగా ‘ముత్యాలమ్మ’ జాతర