కొండపాక : లారీని నిలిపి దిగుతున్న క్రమంలో అదుపుతప్పి కింద పడడంతో డ్రైవర్ మృతి చెందాడు. ఈ ఘటన మండల పరిధిలోని దుద్దెడ గ్రామ శివారులోని టోల్గేట్ వద్ద శనివారం జరిగింది. యాదాద్రి భువనగిరి జిల్లా వలికొండ గ్రామానికి చెందిన రాజు (44) లారీ డ్రైవర్.
శనివారం అతడు దుద్దెడ గ్రామ శివారులోని టోల్గేట్ వద్ద లారీని నిలిపి దిగుతుండగా కాలుజారి కిందపడిపోయాడు. ముక్కు భాగం రోడ్డుకు బలంగా తాకడంతో తీవ్ర గాయాలయ్యాయి. గమనించిన టోల్గేట్ సిబ్బంది అతడిని అంబులెన్స్లో సిద్దిపేట ప్రభుత్వ దవాఖానకు తరలించగా అక్కడ చికిత్స పొందుతూ మృతి చెందాడు. ఈ మేరకు సిద్దిపేట త్రీ టౌన్ పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.