సిద్దిపేట కలెక్టరేట్, ఏప్రిల్ 27 : జిల్లాలోని పలు ప్రభుత్వ దవాఖానల్లో స్టాఫ్నర్సు పోస్టుల నియామకం కోసం ఈ నెల 29వ తేదీన ఇంటర్యూలు నిర్వహిస్తున్నట్లు కలెక్టర్ వెంకట్రామ్రెడ్డి ప్రకటనలో తెలిపారు. మంగళవారం ఆయన మాట్లాడారు. కొవిడ్ నేపథ్యంలో తాత్కాలిక పద్ధతిలో ఈ నియామకాలు చేపడుతున్నట్లు తెలిపారు. బీఎస్సీ నర్సింగ్, స్టాఫ్నర్సు కోర్సులు పూర్తిచేసి ఆసక్తిగల అభ్యర్థులు ధ్రువపత్రాలతో సిద్దిపేటలోని కలెక్టర్ కార్యాలయంలో ఉదయం 9 గంటలకు ప్రారంభయ్యే ఇంటర్వ్యూలో పాల్గొనాలని సూచించారు. జిల్లావ్యాప్తంగా పలు ప్రభుత్వ దవాఖానల్లో మొత్తం 9 పోస్టులను భర్తీ చేస్తున్నట్లు పేర్కొన్నారు. ఆసక్తి గల అభ్యర్థులు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని కలెక్టర్ సూచించారు.
సిద్దిపేట జోన్, ఏప్రిల్ 27 : సిద్దిపేట ప్రభుత్వ వైద్య కళాశాలలో పనిచేసేందుకు 3 నెలల కాంట్రాక్ట్ పద్ధతిలో అసిస్టెంట్ ప్రొఫెసర్ జనరల్ మెడిసిన్, అసిస్టెంట్ ప్రొఫెసర్ అనస్తీషియా, స్టాఫ్నర్సు 36 మంది, ల్యాబ్టెక్నీషియన్ 3 మంది పనిచేసేందుకు బుధవారం ఇంటర్వ్యూలు నిర్వహిస్తున్నట్లు వైద్య కళాశాల డైరెక్టర్ తమిళ అరసి తెలిపారు. ఆసక్తి ఉన్న అభ్యర్థులు సంబంధిత ధ్రువపత్రాలతో ఇంటర్వ్యూకు హాజరు కావాలని కోరారు.
మెదక్, ఏప్రిల్ 27 : మెదక్ జిల్లా దవాఖానలో కాంట్రాక్టు పద్ధతిన అనస్తీషియా డాక్టర్గా పనిచేసేందుకు అర్హులైన అభ్యర్థుల నుంచి దరఖాస్తులు ఆహ్వానిస్తున్నామని కలెక్టర్ హరీశ్ మంగళవారం ఒక ప్రకటనలో తెలిపారు. కరోనా రోగులకు వైద్యం చేయుటకు ఒక అనస్తీషియా డాక్టర్ సేవలు అవసరం ఉన్నాయన్నారు. ఆసక్తి, అర్హతల గల అభ్యర్థులు ఈ నెల 28వ తేదీ సాయంత్రం 5 గంటలలోపు పూర్తి బయోడెటా, ధ్రువపత్రాలతో దరఖాస్తును కలెక్టరేట్లో సమర్పించాల్సిందిగా ఆయన సూచించారు. ఈ నెల 29న గురువారం ఉదయం 11గంటలకు కలెక్టరేట్లో ఇంటర్వ్యూ నిర్వహించనున్నట్లు తెలిపారు. ఎంపికైన అభ్యర్థి మెదక్ జిల్లా దవాఖాన సూపరింటెండెంట్ నియంత్రణలో పనిచేయాల్సి ఉంటుందన్నారు. జాతీయ ఆరోగ్య మిషన్ నిబంధన మేరకు రెమ్యూనరేషన్ (జీతం) ఇస్తామని తెలిపారు.