కొండపాక, జూన్ 30 : రైతు సంక్షేమమే సీఎం కేసీఆర్ లక్ష్యమని ఫారెస్టు డెవలప్ కార్పొరేషన్ చైర్మన్ వంటేరు ప్రతాప్ అన్నారు. కొండపాక మండలం కుకునూరుపల్లిలో రాష్ట్ర ఆర్థిక శాఖ మంత్రి హరీశ్ గురువారం నాల్గో విడుత పల్లెప్రగతి పనులు, పలు అభివృద్ధి కార్యక్రమాలకు శంకుస్థాపన చేయనున్న నేపథ్యంలో ఆయన సభా ఏర్పాట్లను ఎఫ్ చైర్మన్ పరిశీలించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడారు. ప్రతి పల్లెను అన్ని రంగాల్లో అభివృద్ధి చేయాలనే గొప్ప లక్ష్యంతో పల్లెప్రగతి కార్యక్రమాన్ని సీఎం కేసీఆర్ దేశంలోనే ఎక్కడా లేని విధంగా వినూత్నంగా చేపట్టారన్నారు. ఈ కార్యక్రమంలో రైతుబంధు సమితి మండల అధ్యక్షుడు నూనె కుమార్ కుకునూరుపల్లి సర్పంచ్ పొల్కంపల్లి జయంతి నరేందర్, ఉప సర్పంచ్ బాలాగౌడ్, టీఆర్ నాయకులు రవీందర్, అహ్మద్, కనకయ్య, రాజు, మండల వ్యవసాయ అధికారి ప్రభాకర్ పాల్గొన్నారు.
నేడు మంత్రి హరీశ్ పర్యటన..
మంత్రి హరీశ్ గురువారం మండలంలోని కుకునూరుపల్లి ముద్దాపూర్, తిప్పారం గ్రామాల్లో పర్యటించనున్నారు. కుకునూరుపల్లిలో నాల్గో విడుత పల్లెప్రగతి కార్యక్రమాన్ని ప్రారంభించేందుకు అన్ని ఏర్పాట్లు చేశారు. తిప్పారంలో గ్రామ పంచాయతీ, మహిళా సమాఖ్య భవన ప్రారంభోత్సవం, ముద్దాపూర్ గాంధీ విగ్రహ ఆవిష్కరణ, కుకునూరుపల్లిలో ప్రకృతివనం, రైతువేదికల ప్రారంభం, అంగన్ షాపింగ్ కాంప్లెక్స్, యూత్ బిల్డింగ్, నాయీబ్రాహ్మణ కమ్యూనిటీ హాల్, నిర్మాణాలకు మంత్రి శంకుస్థాపన చేయనున్నారని ఎఫ్ చైర్మన్ ప్రతాప్ టీఆర్ మండల అధ్యక్షుడు నూనె కుమార్ నాయకులు పొల్కంపల్లి నరేందర్ తెలిపారు.