సిద్దిపేట, ఫిబ్రవరి 22 (నమస్తే తెలంగాణ ప్రతినిధి) : కాళేశ్వరం ప్రాజెక్టు ఎత్తిపోతల పథకంలో సిద్దిపేట జిల్లా రిజర్వాయర్ల ఖిల్లాగా మారింది. రాష్ట్రంలోనే సిద్దిపేట జిల్లాలో అత్యధికంగా రిజర్వాయర్లు నిర్మించింది. శ్రీరంగనాయక సాగర్, మల్లన్నసాగర్, కొండపోచమ్మ, తోటపల్లి ఆన్లైన్, గౌరవెల్లి-గండిపల్లి, తపాస్పల్లి రిజర్వాయర్లు సిద్దిపేట జిల్లాకు నలుదిక్కులా ఉన్నాయి. మరోవైపు సిద్దిపేట జిల్లా ఆధ్యాత్మికతకు పెట్టింది పేరు. జిల్లాలోని దేవాలయాల పేర్ల మీదనే రిజర్వాయర్లు నిర్మించారు. కొమురవెల్లి, కొండపోచమ్మ, అనంతగిరి పోచమ్మ, నాచారం లక్ష్మీనర్సింహస్వా మి, సిద్దిపేట కోటిలింగేశ్వర, వేంకటేశ్వరస్వామి, వర్గల్, అనంతసాగర్ సరస్వతీమాత, కూడవెల్లి రామలింగేశ్వరస్వామి, బెజ్జంకి లక్ష్మీనర్సింహ స్వా మి, పొట్లపల్లి రాజరాజేశ్వరస్వామి, హుస్నాబాద్లో ఎల్లమ్మతల్లి దేవాలయాలు ఉన్నాయి. కొమురవెల్లి మల్లన్న పేరు మీద మల్లన్నసాగర్ రిజర్వాయర్, కొండపోచమ్మ తల్లి పేరు మీద మర్కూక్ వద్ద కొండపోచమ్మ రిజర్వాయర్, శ్రీరంగనాయక స్వామి పేరు మీద రంగనాయక సాగర్ రిజర్వాయర్ల పేర్లు పెట్టా రు. సీఎం కేసీఆర్ చేసిన గొప్ప ప్రయత్నంతో బీడు వారిన పంట పొలాలను సస్యశ్యామలం అయ్యా యి. ఎటు చూసినా పచ్చని పంట పొలాలు కనిపిస్తున్నాయి. ఉమ్మడి మెదక్ జిల్లాతో పాటు ఉమ్మడి నల్లగొండ, నిజామాబాద్ జిల్లాలకు ఈ ప్రాజెక్టులతో బహుళ ప్రయోజనాలు కలిగి ఉన్నాయి.
సిద్దిపేట జిల్లాలోని పంపుహౌస్ల వివరాలు
రంగనాయక సాగర్ రిజర్వాయర్
(3 టీఎంసీలు)
-చిన్నకోడూరు మండలం చంద్లాపూర్ వద్ద
పంపుహౌస్ నిర్మాణం
– 4 పంపులు , ఒక్కొక్కటి 134 మెగావాట్ల
సామర్థ్యం
మల్లన్నసాగర్ రిజర్వాయర్
(50 టీఎంసీలు)
– తొగుట మండలం తుక్కాపూరు వద్ద
పంప్హౌస్ నిర్మాణం
– 8 పంపులు, ఒక్కొక్కటి 43 మెగావాట్ల
సామర్థ్యం
కొండపోచమ్మ రిజర్వాయర్
(15 టీఎంసీలు )
– అక్కారం వద్ద పంపుహౌస్ నిర్మాణ
– 6 పంపులు, ఒక్కొక్కటి 27 మెగావాట్ల
సామర్థ్యం
– మర్కూక్ వద్ద పంపుహౌస్ నిర్మాణం
-6 పంపులు, ఒక్కొక్కటి 34 మెగావాట్ల
సామర్థ్యం