సిద్దిపేట కమాన్/ సిద్దిపేట అర్బన్/ గజ్వేల్/ములుగు/జగదేవ్పూర్/దుబ్బాక /దుబ్బాక టౌన్/ రాయపోల్/తొగుట/చేర్యాల/కొమురవెల్లి /హుస్నాబాద్/హుస్నాబాద్టౌన్/అక్కన్నపేట/సిద్దిపేట జోన్, జూన్ 2 : తెలంగాణ రాష్ట్ర అవతరణ వేడుకలు బుధవారం జిల్లావ్యాప్తంగా ఘనంగా జరిగాయి. జిల్లా కేంద్రం సిద్దిపేటలోని అన్ని ప్రభుత్వ, ప్రైవేట్ కార్యాలయాల్లో జాతీయ జెండాను ఆవిష్కరించారు. సిద్దిపేట ముస్తాబాద్ చౌరస్తాలో ఆచార్య జయశంకర్ సార్ విగ్రహానికి పూలమాల వేసి నివాళులర్పించారు. సీఎం కేసీఆర్ నాయకత్వంలో రాష్ట్రం అన్ని రంగాల్లో అభివృద్ధి చెందుతుందని జడ్పీ చైర్పర్సన్ రోజాశర్మ అన్నారు. సీఎం కేసీఆర్ ఉద్యమించి, సాధించిన తెలంగాణ రాష్ట్రంలో ప్రజలు సంతోషంగా ఉన్నారని ఎఫ్డీసీ చైర్మన్ వంటేరు ప్రతాప్రెడ్డి అన్నారు. దుబ్బాక పట్టణంలో గాంధీ విగ్రహం వద్ద ఎమ్మెల్యే రఘునందన్రావు జాతీయజెండాను ఆవిష్కరించారు. సిద్దిపేట మున్సిపల్లో జరిగిన కార్యక్రమాల్లో మున్సిపల్ చైర్పర్సన్ మంజులా రాజనర్సు, కమిషనర్ రమణాచారి, సుడా చైర్మన్ రవీందర్రెడ్డి, సఖి సెంటర్ ఏజెన్సీ స్వరూపారాణి పాల్గొన్నారు.
గజ్వేల్ నియోజకవర్గంలో..
గజ్వేల్ నియోజకవర్గంలోని గజ్వేల్, వర్గల్, మ ర్కూక్, జగదేవ్పూర్, ములుగు మండలాల్లో జరిగిన కార్యక్రమాల్లో గడా అధికారి ముత్యంరెడ్డి, మున్సిపల్ చైర్మన్ రాజమౌళి, ఏఎంసీ చైర్పర్సన్ అన్నపూర్ణా శ్రీనివాస్, ఎంపీపీ అమరావతి శ్యాంమనోహర్, కోమటిబండ మిషన్ భగీరథ ఈఈ రాజయ్య, ఆర్డీవో విజయేందర్రెడ్డి, మున్సిపల్ కమి షనర్ వెంకటగోపాల్, వైస్ చైర్మన్ జకీయొద్దీన్, జడ్పీటీసీ మల్లేశం, ఎఫ్ఆర్వో కిరణ్కుమార్, సీడీపీవో వెంకటరాజమ్మ, వంటిమామిడి ఏఎంసీ చైర్మన్ జహంగీర్, పీఏసీఎస్ చైర్మన్ బట్టు అంజిరెడ్డి, ఎంపీపీలు లావణ్యాఅంజన్ గౌడ్, లతారమేశ్గౌడ్, పాండుగౌడ్, తహసీల్దార్ రఘువీర్రెడ్డి, ఎస్సై కృష్ణ, టీఆర్ఎస్ మండల అధ్యక్షుడు నాగరాజు, జడ్పీటీసీలు బాలమల్లు, మంగమ్మ రామచంద్రం, కేసీఆర్సేవా దళం జిల్లా అధ్యక్షుడు బానాపురం వెంకటేశం, నాచారం ఆలయ చైర్మన్ హరిపంతులు, ఎంపీడీవో ఓబులేష్ పాల్గొన్నారు.
దుబ్బాక నియోజకవర్గంలో..
దుబ్బాక నియోజకవర్గంలోని దుబ్బాక, మిరుదొడ్డి, తొగుట, దౌల్తాబాద్, రాయపోల్ మండలాల్లో ఆవిర్భావ వేడుకలు నిరాండబరంగా జరిగాయి. ఆయా కార్యక్రమాల్లో మున్సిపల్ చైర్పర్సన్ వనితాభూంరెడ్డి, టీఆర్ఎస్ మున్సిపల్ అధ్యక్షుడు స్వామి, ఎంపీపీ పుష్పలత, జడ్పీటీసీ రవీందర్రెడ్డి, పీఎసీఎస్ చైర్మన్ కైలాశ్, ఏఎంసీ చైర్మన్ బండి శ్రీలేఖ పాల్గొన్నారు. తొగుటలో తహసీల్దార్ బాల్రెడ్డి, ఏఎస్సై మంజూర్ హుస్సేన్, ఎంపీపీ లతానరేందర్రెడ్డి, రాయపోల్లో ఎంపీపీ అనితాశ్రీనివాస్, తహసీల్దార్ శ్రీవళ్లి, ఏఎస్సై రాజు, సర్పం చ్ మౌనికా రాజిరెడ్డి, పీహెచ్సీ డాక్టర్ శ్రీధర్, ఏపీఎం దుర్గయ్య, ఎంపీడీవో రాంరెడ్డి, ఎంపీవో శ్రీనివాస్, టీఆర్ఎస్ మండల అధ్యక్షుడు వెంకటేశ్వరశర్మ జాతీ య జెండాను ఆవిష్కరించారు. మిరుదొడ్డిలో జరిగిన వేడుకల్లో ఎంపీపీ గజ్జెల సాయిలు, పీఏసీఎస్ చైర్మన్, టీఆర్ఎస్ రాష్ట్ర కార్యదర్శి బక్కి వెంకటయ్య, తహసీల్దార్ సుజాత, మార్కెట్ కమిటీ చైర్మన్సత్యనారాయణ పాల్గొన్నారు.
హుస్నాబాద్ డివిజన్లో…
హుస్నాబాద్ డివిజన్లో పట్టణంతోపాటు హుస్నాబాద్, అక్కన్నపేట, కోహెడ, బెజ్జంకి మండలాల్లో రాష్ట్ర ఆవిర్భావ వేడుకలు ఘనంగా జరిగాయి. ఆయా కార్యక్రమాల్లో ఆర్డీవో జయచంద్రారెడ్డి, మున్సిపల్ చైర్పర్సన్ రజితావెంకట్, ఎంపీపీలు లకావత్ మానస, మాలోతు లక్ష్మీ, కొక్కుల కీర్తి, లింగాల నిర్మల,ఏసీపీ మహేందర్, సీఐ రఘుపతిరెడ్డి, టీఆర్ఎస్ మండల అధ్యక్షులు వంగ వెంకట్రాంరెడ్డి, ఆవుల మహేందర్, ఎండీ అన్వర్, మున్సిపల్ కమిషనర్ రాజమల్లయ్య, వైస్చైర్పర్సన్ అనితారెడ్డి, మార్కెట్ చైర్మన్ కాసర్ల అశోక్బాబు, జడ్పీటీసీ భూక్య మంగ, టీఆర్ఎస్ రాష్ట్ర కార్యదర్శి కర్ర శ్రీహరి, ఫ్యాక్స్ చైర్మన్ దేవేందర్రావు, వైస్ ఎంపీపీ రాజిరెడ్డి పాల్గొన్నారు.
చేర్యాల,ధూళిమిట్ట మండలాల్లో..
చేర్యాల, కొమురవెల్లి, మద్దూరు, ధూళిమిట్ట మండలాల్లో వైభవంగా జరిగాయి. కొమురవెల్లి మల్లన్న ఆలయ పాలక మండలి చైర్మన్ భిక్షపతి, మున్సిపల్ చైర్పర్సన్ స్వరూపారాణి, సీఐ శ్రీనివాస్రెడ్డి, ఎంపీపీలు బద్దిపడిగె కృష్ణారెడ్డి, వుల్లంపల్లి కరుణాకర్, తలారీ కీర్తనాకిషన్, చేర్యాల మార్కెట్ కమిటీ చైర్మన్ సుంకరి మల్లేశం, పీఏసీఎస్లో చైర్మన్ వంగా చంద్రారెడ్డి జాతీయ జెండాను ఆవిష్కరించారు. కార్యక్రమాల్లో జడ్పీటీసీలు మల్లేశం, సిలువేరు సిద్దప్ప, టీఆర్ఎస్ మండల అధ్యక్షులు అనంతుల మల్లేశం, మంద యాదగిరి, సర్పంచ్ దీపికావేణుగోపాల్రెడ్డి, మార్కెట్ వైస్ చైర్మన్ వెంకట్రెడ్డి, మున్సిపల్ వైస్ చైర్మన్ నిమ్మ రాజీవ్రెడ్డి, వైస్ ఎంపీపీ తాండ్ర నవీన్రెడ్డి పాల్గొన్నారు.