సిద్దిపేట అర్బన్, జూన్ 12 : వరిలో వెదజల్లే పద్ధతి సాగుకు ప్రభుత్వం ఎంతగానో ప్రోత్సహిస్తున్నదని, ఆ దిశగా రైతులు సాగుకు మొగ్గు చూపాలని రైతుబంధు సమితి జిల్లా అధ్యక్షుడు వంగ నాగిరెడ్డి అన్నా రు. శనివారం ఆయన మా ట్లాడుతూ.. రైతులందరూ వెదజల్లే విధానం ద్వారా సాగు చేస్తే కూలీల కొరతను నివారించి పెట్టుబడి ఖర్చును తగ్గించుకోవచ్చన్నారు. పంట కోత సమయం కూడా 15 రోజుల ముందే వస్తుందన్నారు. ఫలితంగా రైతులకు సమయం.. ఖర్చు ఆదా అవుతాయన్నారు. ఈ నెల 15న వ్యవసాయ శాఖ, రైతుబంధు సమితి ఆధ్వర్యంలో టీ శాట్ చానల్లో ప్రత్యక్ష ప్రసారం ద్వారా అవగాహన కల్పించనున్నట్లు తెలిపారు. వ్యవసాయ శాఖ మంత్రి సింగిరెడ్డి నిరంజన్రెడ్డి, రైతుబంధు సమితి రాష్ట్ర అధ్యక్షుడు పల్లా రాజేశ్వర్రెడ్డి దస్సులో పాల్గొంటారని పేర్కొన్నారు. మండలాల వ్యవసాయ అధికారులు, రైతుబంధు సమితి గ్రామ, మండల కోఆర్డినేటర్లు చొరవ తీసుకోవాలన్నారు. 15వ తేదీన మధ్యాహ్నం 3 గంటల నుంచి సాయంత్రం 5 గంటల వరకు జరిగే అవగాహన సదస్సులో రైతులు పాల్గొనేలా చూడాలన్నారు. ప్రభుత్వం వ్యవసాయ రంగానికి పెద్దపీట వేస్తున్నదని, బడ్జెట్లోనూ అధిక నిధులు కేటాయించిన విషయాన్ని గుర్తు చేశారు. రైతులకు ప్రభుత్వం ఎల్లప్పుడూ అండగా ఉంటుందన్నారు.