వర్గల్, ఏప్రిల్10 : కొండపోచమ్మ సాగర్ నుంచి సంగారెడ్డి కెనాల్ ద్వారా గోదావరి జలాలు ఐదోరోజూ శనివారం పరుగులు తీశాయి. ఈ ఐదు రోజుల్లో సిద్దిపేట జిల్లా వర్గల్ మండలంలోని నాలుగు చెరువులను గంగమ్మ నింపింది. అపర భగీరథుడు, సీఎం కేసీఆర్ ఈనెల 6న సిద్దిపేట జిల్లా అవుసులపల్లి వద్ద సంగారెడ్డి అప్టెక్ తూం వద్ద గోదావరి జలాలను వదిలిన సంగతి తెలిసిందే. ఐదు రోజులుగా వర్గల్ మండలంలోని చౌదర్పల్లి బంధం చెరువు ,వర్గల్ పెద్ద చెరువు, శాకారం ధర్మాయి చెరువు, అంబార్ఖాన్ పేట చెరువులను నింపి 6.26 కిలోమీటర్ల దూరం గోదారమ్మ ప్రవహించింది. ఆదివారం మెదక్ జిల్లాలో గోదావరి జలాలు ప్రవేశిస్తాయి. శనివారం హల్దీవాగుపై మూడు చెక్డ్యామ్లు నిండాయి. గోదావరి జలాల రాకతో వర్గల్ మండలంలోని చౌదర్పల్లి, శేరిపల్లి, వర్గల్ , మల్లారెడ్డిపల్లి, గుంటిపల్లి, శాకారం, అంబారపేట, సీతారాంపల్లి గ్రామాల్లో భూగర్భ జలాలు పెరగడంతో పాటు 990 ఎకరాల ఆయకట్టుకు జీవం పోశాయి.
జల పూజలు…
ఐదురోజుల పాటు వర్గల్ మండలంలో ప్రవహించిన గోదావరి జలాలకు గ్రామగ్రామానా పసుపు, కుంకుమ, పూలతో స్థానికులు హార్ధిక స్వాగతం పలికారు. తొలిరోజు సీఎం కేసీఆర్ చేతుల మీదుగా పూజలందుకున్న గోదావరి జలాలకు, శనివారం కూడాఆయా గ్రామాల ప్రజాప్రతినిధులు గంగమ్మకు పూజలు నిర్వహించారు. శనివారం రాష్ట్ర అటవీ అభివృద్ధి సంస్థ చైర్మన్ వంటేరు ప్రతాప్రెడ్డి, వర్గల్ ఎంపీపీ లతారమేశ్గౌడ్, జడ్పీటీసీ బాలమల్లు యాదవ్, అంబార్పేట, వేలూర్ గ్రామాల సర్పంచులు నర్సింహారెడ్డి, పాపిరెడ్డి, టీఆర్ఎస్ నాయకులు నాగరాజు, మురళీగౌడ్, ప్రభాకర్ గౌడ్, ఆయా గ్రామాల ఎంపీటీసీలు గంగమ్మ పూజలో పాల్గొన్నారు.
సూస్తుండంగానే నీళ్లొచ్చాయి…