సిద్దిపేట : రాష్ట్రంలో మద్యం షాపుల కేటాయింపులో గౌడ సామాజిక వర్గానికి 15 శాతం రిజర్వేషన్లు కల్పించి గౌడ కులస్తుల అభ్యున్నతికి సీఎం కేసీఆర్ బాటలు వేశారని సిద్దిపేట రూరల్ మండల జడ్పీటీసీ కోటగిరి శ్రీహరిగౌడ్ అన్నారు.
శుక్రవారం సిద్దిపేటలోని ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో సీఎం కేసీఆర్, మంత్రి హరీశ్రావు ఫ్లెక్సీకి గౌడ సంఘం నాయకులతో కలిసి ఆయన క్షీరాభిషేకం చేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ గత ప్రభుత్వాలు గౌడ కులస్తులను ఓటు బ్యాంకుగా వాడుకున్నాయని ఆరోపించారు. తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తరువాత సీఎం కేసీఆర్ చెట్ల పన్ను రద్దు చేయడంతోపాటు అన్ని సొసైటీల పరిధిలో ఈత, తాటి వనాలను పెంచుతూ గౌడ కులస్తుల అభ్యున్నతికి విశేషంగా కృషి చేస్తున్నారని కొనియాడారు.
గతంలో గౌడ కులస్తులు మాత్రమే మద్యం వ్యాపారం నిర్వహించి ఉపాధి పొందే వారని, గత ప్రభుత్వాల నిర్లక్ష్యంతో ఇతరులు కూడా ఈ వ్యాపారంలోకి ప్రవేశించి తమ ఉపాధిని దెబ్బతీశారన్నారు. సీఎం కేసీఆర్, మంత్రులు హరీశ్రావు, శ్రీనివాస్గౌడ్ల ప్రత్యేక కృషితో రిజర్వేషన్లు వచ్చాయన్నారు. కార్యక్రమంలో సిద్దిపేట నియోజకవర్గ గౌడ సంఘం నాయకులు కోల రమేశ్గౌడ్, సత్యనారాయణగౌడ్, భాస్కర్గౌడ్, బీఆర్ గౌడ్, పరమేశ్వర్గౌడ్, మహేశ్గౌడ్, రవిగౌడ్, మనోజ్గౌడ్ తదితరులు పాల్గొన్నారు.