సిద్దిపేట జోన్, మే 28 : శ్మశాన వాటికల్లో తక్కువ ఖర్చుతో గ్యాస్తో దహన సంస్కారాలు చేయడం ఒక ప్ర క్రియ. ఇలాంటి గ్యాస్తో దహన సంస్కారాలు చేసేందు కు సిద్దిపేట పట్టణంలో ఎల్పీజీ డబుల్ బర్నర్ క్రిమిటోరియంను ప్రశాంత్నగర్ వైకుంఠధామంలో నిర్మించనున్నారు. ఇందుకు సంబంధించి మంత్రి హరీశ్రావు ప్ర శాంత్నగర్ శ్మశాన వాటికలో ఈ క్రిమిటోరియాన్ని నిర్మించేందుకు రూ.27 లక్షలను మంజూరు చేయించారు.
సాధారణంగా ఎవరైనా వ్యక్తులు చనిపోయినప్పుడు కట్టెలను కాడుగా పేర్చి దహన సంస్కారాలు చేసే ప్రక్రియ సాధారణంగా జరుగుతుంది. పట్టణాల్లో మోడ్రన్ వైకుంఠధామాలు ఏర్పడిన తర్వాత ఎలక్ట్రికల్ క్రిమిటోరియం ద్వారా దహన సంస్కారాలు అందుబాటులోకి వచ్చాయి. తాజాగా జిల్లా కేంద్రం సిద్దిపేట ప్రశాంత్నగర్ వైకుంఠధామంలో సుమారు రూ.27 లక్షల మున్సిపల్ నిధులతో ఎల్పీజీ డబుల్ బర్నర్ క్రిమిటోరియాన్ని ఏర్పాటు చేయనున్నారు. ఇందుకోసం రూ.12 లక్షలతో యంత్రాలు, రూ.15 లక్షలతో షెడ్డును ఏర్పాటు చేయనున్నారు. ఇక్కడే ఎల్పీజీ గ్యాస్ బర్నర్ క్రిమిటోరియం, సింగిల్ బర్నర్ను బూడిదను సేకరించేందుకు ఒక ఫిట్ను ఏర్పాటు చేయనున్నారు. 2 ఆటోమెటిక్ ఎల్పీజీ బర్నర్ విత్ సీక్వెన్సీ కంట్రోలర్ ఏర్పాటు చేస్తారు.
ఎల్పీజీ గ్యాస్ పైపులైన్ ఏర్పాటు చేయడంతోపాటు కంట్రోల్ ప్యానల్ బోర్డు, వెట్ స్క్రబ్బర్, విత్ పంపుమోటారు, 2 హెచ్పీ బ్లోయర్ బెల్టు, 30 ఫీట్లతోపాటు క్రిమిటోరియాన్ని నిర్మించనున్నారు. షెడ్డులోను 12 ఫీట్ల వైశాల్యంలో ని ర్మించనున్నారు. 24 గంటల వాటర్ సైప్లెతోపాటు టాయిలెట్ రూమ్, వాటర్ అవుట్లెట్ కనెక్టెడ్ డ్రైనేజీని నిర్మించనున్నారు. గ్యాస్ క్రిమిటోరియం బర్నర్ను ఏర్పాటు చేయడం వల్ల అంత్యక్రియల ప్రక్రియ సరళీకృతం కావడంతోపాటు సాంప్రదాయబద్ధంగా చేసే అంత్యక్రియల కంటే ఇందులో దహనం చేయడానికి అయ్యే వ్యయం తక్కువవుతుంది. పర్యావరణ పరంగానూ ఇది ఎంతో ఉపయోగకరంగా ఉంటుంది. గ్యాస్ దహన ప్రక్రియలో ఒక శరీరాన్ని దహనం చేసేందుకు సగటున 45 నిమిషాల సమయం పడుతుంది.