సిద్దిపేట టౌన్, ఏప్రిల్ 28 : సిద్దిపేట ప్రభుత్వ డిగ్రీకళాశాల, శ్రీకృప ఇనిస్ట్యూట్ ఆఫ్ ఫార్మాసిటికల్ సైన్సెస్ వెలికట్ట కళాశాలల మధ్య స్కిప్స్తో ఒప్పందం బుధవారం కుదిరింది. ఈ సందర్భంగా స్కిప్స్ ప్రిన్సిపాల్ మంజునాథ్, జంతుశాస్త్ర విభాగ అధిపతి డాక్టర్ అయోధ్యరెడ్డి మాట్లాడారు. స్కిప్స్ల మధ్య విద్య, పరిశోధన, అభివృద్ధికి విద్యార్థులు, అధ్యాపకులు అకాడమిక్ మార్పిడి, లాబొరెటరీస్ కోసం ఈ అవగాహన ఒప్పందం ఏర్పాటు చేసుకున్నట్లు చెప్పారు. ఈ ఒప్పందం ద్వారా రెండు సంస్థల విద్యార్థులకు, అధ్యాపకులకు ప్రయోజనం చేకూరుతుందని తెలిపారు. విద్యా, పరిశోధన రంగానికి ఈ ఒప్పందం దోహదపడుతుందని వ్యాఖ్యానించారు. పరిశోధన రంగంలో ఉమ్మడి అంశాల అధ్యయనానికి ఈఎంవోయూ ఎంతో ఉపయోగకరంగా ఉంటుందని చెప్పారు. కార్యక్రమంలో మధుసూదన్, గుణాకర్, విశ్వనాథ్, పుణ్యమ్మ, శ్రీనివాస్రెడ్డి, జగదీశ్వర్చారి, శివకుమార్, విజయ్, భరత్, సిమ్రాన్ తదితరులు పాల్గొన్నారు.