60 ఆక్సిజన్ బెడ్లు, వెంటిలేటర్ల ఏర్పాటు
ఎఫ్డీసీ చైర్మన్ ప్రతాప్రెడ్డి
గజ్వేల్ ఏరియా దవాఖానలో వ్యాక్సినేషన్ పరిశీలన
గజ్వేల్ అర్బన్, మే 26 : గజ్వేల్ పట్టణంలోని ప్రభుత్వ జిల్లా దవాఖానలో కొవిడ్ బాధితుల కోసం త్వరలో ఆక్సిజన్ ప్లాంట్ను ఏర్పాటు చేయనున్నట్టు ఎఫ్డీసీ చైర్మన్ వంటేరు ప్రతాప్రెడ్డి అన్నారు. బుధవారం గజ్వేల్లోని ప్రభుత్వ జిల్లా దవాఖానలో కొవిడ్ వ్యాక్సినేషన్, కొవిడ్ నిర్ధారణ పరీక్షలను మున్సిపల్ చైర్మన్ రాజమౌళితో కలిసి ఆయన పరిశీలించారు. ఈ సందర్భంగా ప్రతాప్రెడ్డి మాట్లాడుతూ సీఎం కేసీఆర్, మంత్రి హరీశ్రావు ఆదేశాల మేరకు ప్రజలకు కొవిడ్ సేవలు అందించేందుకు గజ్వేల్ దవాఖానలో ఆక్సిజన్ ప్లాంట్ను ఏర్పాటు చేస్తున్నట్టు తెలిపారు. దవాఖానలో ఆక్సిజన్ ప్లాంటుతోపాటు 60 ఆక్సిజన్ బెడ్లతో కొవిడ్ బాధితులకు వై ద్య సేవలు అందజేస్తామన్నారు. ఈ మేరకు సీఎం కేసీఆర్కు, మంత్రి హరీశ్రావుకు ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపారు. గజ్వేల్ ప్రభుత్వ దవాఖాన.. కార్పొరేట్ దవాఖానలను తలదన్నేలా తయారైందన్నారు. ప్రభుత్వ దవాఖానలో కొవిడ్ టెస్టులు ఎక్కువ చేసే విధంగా అధికారులు చర్యలు తీసుకోవాలని సూచించారు. వారి వెంట మున్సిపల్ వైస్ చైర్మన్ జకియొద్దీన్, కౌన్సిలర్ మెట్టయ్య, బాలమణీశ్రీనివాస్రెడ్డి ఉన్నారు.