సిద్దిపేట, ఏప్రిల్ 13 (నమస్తే తెలంగాణ ప్రతినిధి) : సిద్దిపేట మున్సిపాలిటీ ఎన్నికల నిర్వహణకు ముమ్మరంగా ఏర్పాట్లు జరుగుతున్నాయి.ప్రస్తుత పాలక వర్గం పదవీకాలం ఈనెల 15తో ముగియనున్నది. రాష్ట్ర ఎన్నికల కమిషన్ ఆదేశాల మేరకు మున్సిపల్ యంత్రాంగం వార్డుల విభజన, తదితర వాటిని పూర్తి చేసిం ది. పట్టణ జనాభా పెరగడంతో ప్రస్తుతం ఉన్న 34 వార్డులను 43 కు రాష్ట్ర ప్రభుత్వం పెంచింది. నేడు వార్డుల వారీగా ఎస్సీ, ఎస్టీ, బీసీ, మహిళా ఓటర్ల తుది జాబితా వెలువడనున్నది.అనంతరం వార్డుల రిజర్వేషన్ల ప్రక్రియను పూర్తి చేయనున్నారు. రిజర్వేషన్ల ప్రక్రియ పూర్తయిన తక్షణమే ఎన్నికల షెడ్యూల్ వెలువడనున్నట్లు సమాచారం. ఈనెలాఖరులోగా ఎన్నికలను పూర్తిచేసే లక్ష్యంగా ఏర్పాట్లు జరుగుతున్నట్లు తెలిసింది. ఈ నెల 30న పోలింగ్ నిర్వహించి, మే 3న ఫలితాలు వెలువడనున్నట్టు విశ్వసనీయ సమాచారం. తక్కువ వ్యవధిలోనే మున్సిపల్ ఎన్నికలను పూర్తి చేసే అవకాశం ఉంది. రెండురోజుల్లో ఎన్నికల నోటిఫికేషన్ వెలువడే అవకాశం ఉంది. ఈ నేపథ్యంలో ఆశావహులంతా రిజర్వేషన్ల కోసం ఎదురు చూస్తున్నారు.
వార్డులు 43కు పెంపు…
జిల్లా కేంద్రమైన సిద్దిపేట మున్సిపాలిటీకి ఈ నెలాఖరులో ఎ న్నికలు జరిగే అవకాశం ఉన్న నేపథ్యంలో రాజకీయ పార్టీలు ఎన్నికలపై దృష్టి సారించాయి. ప్రస్తుతం ఉన్న 34 వార్డులను 43కు పెంచడంతో ప్రస్తుత వార్డుల సరిహద్దులు మారాయి. దీంతో ఏ వార్డు ఎవరికి అనుకూలంగా ఉంటుందో రిజర్వేషన్లు తెలిస్తే గాని చెప్పలేని పరిస్థితి. మున్సిపాలిటీలో మొత్తం 1,00,658 మంది ఓటర్లున్నారు. వీరిలో పురుష ఓటర్లు 49,880 మంది, మహిళా ఓటర్లు 50,757 మంది , 11మంది థర్డ్ జెండర్ ఉన్నారు. మహిళలకు 50శాతం రిజర్వేషన్లు కల్పంచాలన్న నిబంధనల మేరకు 43 వార్డుల్లో 22 ఆన్ రిజర్వుడు, 21 రిజర్వుడు చేశారు. వీటిలో ఎస్టీ 1, ఎస్సీ 3 వార్డుల్లో, జనరల్ -2, మహిళా-1, బీసీ 17 వార్డుల్లో -8 మహిళా, 9 జనరల్ స్థానాలు. 22 వార్డులు ఆన్రిజర్వుడు కాగా, వీటిలో మహిళా -12, జనరల్ -10 ఉన్నాయి.
ఇదిలా ఉంటే ..కరోనా నేపథ్యంలో అందుకు అనుగుణంగా పోలింగ్ కేంద్రాలను ఏర్పాటు చేయనున్నారు. ప్రతి 800 మంది ఓటర్లుకు ఒక పోలింగ్ కేంద్రాన్ని ఏర్పాటు చేయాలనే, ఆదిశగా సిద్దిపేట మున్సిపాలిటీలో 129 పోలింగ్ కేంద్రాలను ఏర్పాటు చేయాలని మున్సిపల్ అధికారులు నిర్ణయించారు. వార్డుల పునర్విభజనతో ఆయా వార్డుల స్వరూపం పూర్తిగా మారిపోయింది. సోమవారం సిద్దిపేటలోని విపంచి ఆడిటోరియంలో వివిధ మున్సిపాలిటీల నుంచి వచ్చిన 165 మంది అధికారులకు ఎన్నికల నిర్వహణపై శిక్షణ నిర్వహించారు.సిద్దిపేట మున్సిపల్ ఎన్నికల నిర్వహణలో భాగంగా 14మంది ఆర్వోలు, ముగ్గురు రిజర్వుడు ఆర్వో లు, 14మంది ఏఆర్వోలు, 3 రిజర్వు ఏఆర్వోలను నియమించా రు. ఆర్వోలు నామినేషన్ల నుంచి ఓట్ల లెక్కంపు ప్రక్రియ ముగిసే వరకు బాధ్యతలు నిర్వర్తిస్తారు. ఒక్కో ఆర్వోకు మూడు వార్డులను కేటాయించినట్లు సమాచారం.
రాష్ట్రంలోనే మోడల్ పట్టణం సిద్దిపేట..
సిద్దిపేట పట్టణాన్ని మోడల్గా ఆర్ధిక శాఖ మంత్రి తన్నీరు హరీశ్రావు తీర్చిదిద్దారు. సిద్దిపేట అంటేనే ఒక ప్రయోగశాల అన్నట్లుగా తయారు చేశారు. ఇక్కడ వందల కోట్ల రూపాయలతో అభివృద్ధి పనులు పూర్తి చేశారు. నిరంతరం పట్టణాభివృద్ధ్దిపై దృష్టిసారించిన మంత్రి హరీశ్రావు, రాష్ట్రంలోని అన్ని పట్టణాలకు సిద్దిపేట అధ్యయన కేంద్రంగా నిలిపారు. ఇతర మున్సిపాలిటీ వాళ్లు సిద్దిపేటకు వచ్చి ఇక్కడ జరిగిన అభివృద్ధిని చూసి వెళ్లి వారి పట్టణాల్లో చేసుకుంటున్నారు. ఈ ఐదేం డ్ల కాలంలోనే అ న్ని శాఖల నిధులు కలుపుకొ ని సుమారు రూ. 5,149కోట్ల అభివృద్ధి పను లు జరిగాయి. కేవ లం ఒక మున్సిపాలిటీ నుం చి రూ.529 కోట్ల ప నులు చేపట్టగా ,ఇతర శాఖ ల నుంచి రూ.4,620 కోట్ల పనులు చేశారు.
అం టే ఎంత అభివృద్ధి జరిగిందో ఇట్టే అర్ధం అవుతుం ది. సిద్దిపేట జిల్లా కేం ద్రం ఏర్పాటుతో పాటు సీపీ కార్యాలయం ఏర్పాటైంది. దేశానికే రోల్ మోడల్గా డబుల్ బెడ్రూం ఇండ్ల నిర్మాణం చేపట్టి ఇటీవలే సీఎం కేసీఆర్ చేతుల మీదుగా గృహప్రవేశాలు చే యించారు. అదనంగా ము న్సిపాలిటీకి మరో వెయ్యి ఇండ్లను సీఎం కేసీఆర్ మం జూరు చేశారు. ఎక్కడా లేని విధంగా సిద్దిపేట కోమటి చెరువును సుందరీకరించారు. గొప్ప పర్యాటక కేంద్రంగా ఇది మారుతున్నది. ఇటీవల నెక్లెస్ రోడ్డు, పార్కు తదితర పనులు చేపట్టారు. పట్టణంలో అండర్ గ్రౌండ్ డ్రైనేజీ, పట్టణ ప్రధాన రహదారులకు కిరువైపులా పుట్పాత్లు, ఎల్ఈడీ లైట్లు, ప్రధాన కూడళ్లను ఆధునీకరించారు. సుడా, రంగనాయక రిజర్వాయర్, ఐటీ టవర్, స్వచ్ఛ బడి, అక్సిజన్ పార్కు, వైకుంఠధామాలు, హరితహారం, నర్సరీలు, అధునాతన హంగులతో ప్రభుత్వ కార్యాలయాలకు నూతన భవనాలు, వీధి వ్యాపారులకు దుకాణ సముదాయాలు, మెడికల్ కళాశాల, విపంచి ఆడిటోరియం, జయశంకర్ స్టేడియం.. ఇలా చెప్పుకుంటూ పోతే ఎన్నో అభివృద్ధి పనులు సిద్దిపేట పట్టణంలో చేపట్టారు.
ఆశావహుల్లో టెన్షన్ టెన్షన్…
మున్సిపల్ ఎన్నికలకు క్యాడర్ను మంత్రి తన్నీరు హరీశ్రావు సిద్ధం చేశారు. వార్డుల వారీగా నియోజకవర్గంలోని ముఖ్య నాయకులకు ఇన్చార్జి బాధ్యతలను అప్పగించారు. వారు వార్డుల్లో పర్యటిస్తున్నారు.యువత, సోషల్ మీడి యా, పార్టీ ముఖ్య నాయకులతో మంత్రి సమావేశమవు తూ వారికి దిశానిర్దేశం చేస్తున్నారు. ఏ వార్డులో ఎవరై తే బాగుంటుంది..వారి బలా బలాలు ఎమిటీ అనే వి వరాలను ఆరా తీస్తున్నారు. వార్డుల్లో ప్రజలతో ఎలా ఉంటున్నారు అనే అంశాలపై ప్రత్యేకంగా సర్వేలు సైతం చేయిస్తున్నారు.దీంతో ఆశావహుల్లో టెన్షన్ నెలకొంది. అనుకూలమైన రిజర్వేషన్ వస్తుందా? లేదా? ఒకవేల రిజర్వేషన్ అనుకూలంగా రాకపోతే ఎలా? వస్తే మనకు పార్టీ టికెట్టు వస్తుం దా? ఇవన్నీ ఆశావహుల మెదల్లో మొలుస్తు న్న ప్రశ్నలు. ప్రస్తుత పాలక వర్గంలో ఎంత మందికి టికెట్లు వస్తాయో చూడాలి. పైగా గతంలో ఉన్న వాటి కన్నా 9 వార్డులు పెరిగాయి. అదనంగా మరో తొమ్మిది మందికి అవకాశం దక్కినట్లే . ఏది ఏమైనా మున్సిపల్ వార్డులకు రిజర్వేషన్లు ఖరారైతే గాని ఏం చెప్పలేం.