గజ్వేల్అర్బన్, మే12: కరోనా విపత్కర పరిస్థితుల్లోనూ సీఎం కేసీఆర్ పేదింటి ఆడపడుచుల కోసం సంకల్పించిన కల్యాణలక్ష్మి, షాదీముబారక్ పథకాలు కొనసాగుతూనే ఉన్నాయి. గజ్వేల్ పట్టణంలోని 43మంది ఆడపడుచులకు మంజూరైన కల్యాణలక్ష్మి, షాదీముబారక్ చెక్కులను బుధవారం పంపిణీ చేశారు. బుధవారం ప్రత్యేక కార్యక్రమంలో రంజాన్ కానుకలతో పాటు కల్యాణలక్ష్మి, షాదీముబారక్ చెక్కులను పంపిణీ చేయాలని ముందుగా నిర్ణయించినా లాక్డౌన్ కారణంగా కార్యక్రమాన్ని రద్దు చేశారు. లబ్ధిదారులను ఒక్కొక్కరిగా పిలిచి ఉదయం 10గంటల లోగా 43మంది లబ్ధిదారులకు రూ.లక్షా 116 చొప్పున చెక్కులను మున్సిపల్ చైర్మన్ ఎన్సి రాజమౌళి, వైస్ చైర్మన్ జకియోద్దీన్లతో పాటు కౌన్సిలర్లు అందజేశారు. మనోహరాబాద్లో చెక్కులు పంపిణీ చేసిన ఎఫ్డీసీ చైర్మన్ వంటేరు ప్రతాప్రెడ్డి కూడా గజ్వేల్లోని లక్ష్మణ్ గార్డెన్స్కు చేరుకుని లబ్ధిదారులకు చెక్కులను పంపిణీ చేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ప్రతి పేదింటి ఆడపడుచుకు మేనమామలా, ప్రతి ఇంటికి పెద్దకొడుకులా సీఎం కేసీఆర్ తన బాధ్యతను నిర్వహిస్తున్నారన్నారు. ఆడపడుచులకు మేనమామలా షాదీముబారక్, కల్యాణలక్ష్మి ద్వారా అండగా ఉంటూ, వృద్ధ,వికలాంగ వితంతువులకు పింఛన్లు ఇచ్చి ఆసరాగా నిలుస్తున్నారన్నారు. కార్యక్రమంలో పార్టీ పట్టణాధ్యక్షుడు గోపాల్రెడ్డి, కౌన్సిలర్లు బబ్బూరి రజిత, రహీం, ఉప్పలమెట్టయ్య, అల్వాల బాలేశ్, శ్రీనివాస్, నాయకులు శ్రీనివాస్రెడ్డి, శివ, మల్లేశం, సమీర్, వీఆర్వో చారి పాల్గొన్నారు.
ఆడబిడ్డలకు భరోసా కల్పిస్తున్న కేసీఆర్
తెలంగాణలోని ప్రతి ఇంటి ఆడబిడ్డకు కల్యాణలక్ష్మి, షాదీముబారక్ పథకాలతో సీఎం కేసీఆర్ ఎంతో భరోసా కల్పిస్తున్నరని ఏఎంసీ చైర్ పర్సన్ మాదాసు అన్నపూర్ణాశ్రీనివాస్ అన్నారు. బుధవారం మండల పరిధిలోని అహ్మదీపూర్లో కల్యాణలక్ష్మి, షాదీముబారక్ చెక్కుల పంపిణీ అనంతరం రంజాన్ కానుకలను ముస్లింలకు అందచేశారు. కార్యక్రమంలో సర్పంచ్ నవీన,రైతుబంధు సమితి కన్వీనర్ రాజిరెడ్డి, ఆర్ఐ ప్రవీణ్, ఎంపీటీసీ ఆనందం, పీఏసీఎస్ డైరెక్టర్ చాడా శ్రీనివాస్రెడ్డి, రమేశ్, అహ్మద్, నిజాం, సత్యం, బాలయ్య, శ్రీను తదితరులు పాల్గొన్నారు.శ్రీగిరిపల్లిలో బుధవారం రంజాన్ కానుకలను సర్పంచ్ల ఫోరం మండల అధ్యక్షుడు చెరుకు చంద్రమోహన్రెడ్డి అందజేశారు.కార్యక్రమంలో ఎంపీటీసీ ఆంజనేయులు, గ్రామస్తులు పాల్గొన్నారు.