చేర్యాల/కొమురవెల్లి, జూన్ 11 : సంక్షేమ పథకాల అమలులో తెలంగాణ నెంబర్-1గా నిలిచిందని జనగామ ఎమ్మెల్యే ముత్తిరెడ్డి యాదగిరిరెడ్డి అన్నా రు. శుక్రవారం కొమురవెల్లి మండల కేంద్రంలోని టీటీడీ కల్యాణ మండపంలో మండలంలోని వివిధ గ్రామాలకు చెందిన 31మంది లబ్ధిదారులకు ఎమ్మెల్యే ఎంపీపీ తలారి కీర్తన, జడ్పీటీసీ సిద్దప్ప, తహసీల్దార్ శ్రీనివాసరావుతో కలిసి కల్యాణలక్ష్మి చెక్కులను అందజేశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ దేశంలో ఎక్కడా లేని విధంగా సంక్షేమ పథకాల అమలులో తెలంగాణ నెంబర్-1గా నిలిచిందన్నారు. కల్యాణలక్ష్మి ఆడబిడ్డల తల్లిదండ్రుల గుండెల్లో ధైర్యం నింపిందన్నారు. కల్యాణలక్ష్మి పథకం కింద కొమురవెల్లి మండలానికి రూ.4.73 కోట్లు వచ్చాయన్నారు. సంక్షేమ పథకాల అమలు ప్రతి పక్షాలకు కనిపించడం లేదా అని ప్రశ్నించారు. సీఎం కేసీఆర్ ఆలోచనలతో మండుటెండల్లో సైతం వాగులు, చెరువులు నిండాయన్నారు. ట్రాన్స్ఫార్మర్లు కాలిపోతే కాళ్లు అరిగేలా తిరిగిన రోజులు రైతులకు ఇంకా గుర్తున్నాయన్నారు.
అంతకుముందు ఎమ్మెల్యే మల్లన్న ఆలయ చైర్మన్ గీస భిక్షపతి, ఈవో బాలాజీతో కలిసి ఆలయ పరిసరాలు కలియ తిరిగారు. ఆలయ ఆవరణలో క్యూలైన్ల ఏర్పాటు గురించి అడిగి తెలుసుకున్నారు. రాజాగోపురం నుంచి తోటబావి వద్దకు వెళ్లే రోడ్డుపైకి వచ్చే నిర్మాణాలు తొలిగించాలని సూచించారు. పది రోజుల్లో కొమురవెల్లికి వస్తానని, ఆలోగా పనులు చేపట్టాలని అధికారులకు సూచించారు. కార్యక్రమంలో ఏఈవో అంజయ్య, పీఏసీఎస్ చైర్మన్ వంగ చంద్రారెడ్డి, చేర్యాల మార్కెట్ కమిటీ వైస్ చైర్మన్ పుర్మ వెంకట్రెడ్డి, వైస్ ఎంపీపీ కాయిత రాజేందర్రెడ్డి, సర్పంచ్ల ఫోరం మండల అధ్యక్షుడు సద్ది కృష్ణారెడ్డి, ఎంపీటీసీల ఫోరం మండల అధ్యక్షుడు బచ్చల సాయిమల్లు, మల్లన్న ఆల య కమిటీ డైరెక్టర్లు, సర్పంచ్లు, ఎంపీటీసీలు పాల్గొన్నారు.
సీఎం కేసీఆర్ రైతు పక్షపాతి
సీఎం కేసీఆర్ రైతు పక్షపాతి అని ఎమ్మెల్యే ముత్తిరెడ్డి యాదగిరిరెడ్డి అన్నారు. శుక్రవారం మండలంలోని కొత్తదొమ్మాటలో చెక్డ్యాం నిర్మాణ పనులకు ఎమ్మెల్యే ఎంపీపీ వుల్లంపల్లి కరుణాకర్తో కలిసి భూమి పూజ చేశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ కరోనా సమయంలో కూడా సీఎం కేసీఆర్ రైతు సంక్షేమానికి ప్రత్యేక నిధు లు కేటాయించారన్నారు. రూ.30 వేల కోట్లు సమకూర్చి ధాన్యం కొనుగోలు చేసిన ఘనత సీఎం కేసీఆర్కే దక్కుతుందన్నారు. ఈ యేడు పంట రెట్టింపు అయ్యిందని, జనగామ నియోజకవర్గంలో మొట్టమొదటిసారి 350 టన్నులకు పెరిగిందన్నారు. ఇప్పటికే దేవాదుల ద్వారా నీళ్లు వస్తున్నాయని, త్వరలోనే మల్లన్నసాగర్ ద్వారా తపాస్పల్లి రిజర్వాయర్కు కాళేశ్వరం నీళ్లు వస్తాయన్నారు. కార్యక్రమంలో టీఆర్ఎస్ మండలాధ్యక్షుడు అనంతుల మల్లేశం, సర్పంచ్ సోంటిరెక్కల భిక్షపతి, ఎంపీటీసీ వినోద, టీఆర్ఎస్ గ్రామశాఖ అధ్యక్షుడు భాస్కర్, సర్పంచ్లు, ఎంపీటీసీలు, నాయకులు పాల్గొన్నారు.