సిద్దిపేట జోన్ : సిద్దిపేట మున్సిపాలిటీని ఐదేండ్ల కాలం లో అందరి సహకారంతో దేశానికే ఆదర్శంగా నిలిపామని ఆర్థిక మంత్రి హరీశ్రావు అన్నారు. శుక్రవారం సిద్దిపేట మున్సిపల్ ప్రత్యేక బడ్జెట్ 2021-22 మున్సిపల్ చైర్మన్ రాజనర్సు అధ్యక్షతన జరిగింది. ఈ సమావేశానికి మంత్రి హాజరు కాగా, ఈ సందర్భంగా ప్రవేశ పెట్టిన రూ.154.43 కోట్ల బడ్జెట్ను సమావేశంలో ఏకగ్రీవంగా పాలక వర్గం ఆమోదించింది. సిద్దిపేట ప్రజలకు చెత్త సేకరణపై అవగాహన కల్పించిన బెంగళూర్కు చెందిన డాక్టర్ శాంతిని అభినందిస్తూ ప్రతి పాదించిన తీర్మానానికి కౌన్సిల్ ఏకగ్రీవంగా ఆమోదం తెలిపింది. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడు తూ ఐదేండ్లలో పట్టణం అద్భుతంగా అభివృద్ధి చెందిందని, ఐదేండ్లలో పురపాలక సంఘం ద్వారా రూ.529.35 కో ట్లతో అభివృద్ధి చేశామన్నారు.
ఈ పాలకవర్గం హయాంలో మున్సిపల్ ఇతర శాఖల నిధులు కలిపి రూ.5149 కోట్లతో అభివృద్ధి చేశామన్నారు. రూ.3690 కోట్లతో రంగనాయక సాగర్, రూ.163 కోట్లతో డబుల్ బెడ్రూం ఇండ్ల సముదాయం, రూ.715తో మెడికల్ కళాశాల, రూ.3.50 కో ట్లతో గ్రంథాలయం, రూ.40కోట్లతో ఐటీ పార్క్తో పాటు టూరిజం హోటల్, ఎఫ్ఎస్టీపీ,యూజీడీ నిర్మాణం, కోమ టి చెరువు సుందరీకరణ, ఫ్లడ్లైట్లతో కూడిన స్టేడియం, సిమ్మింగ్పూల్ లాంటి అనేక అభివృద్ధి పనులు చేశామని మంత్రి తెలిపారు. ఈ పాలకవర్గం హయంలోనే జిల్లా ఏర్పాటు, పోలీస్ కమిషనరేట్, సుడా ఏర్పడ్డాయన్నారు. వచ్చే ఆర్థిక సంవత్సరానికి మున్సిపల్ కౌన్సిల్ ఆమోదించిన బడ్జెట్ ఈశాన్య భారతదేశంలోని చిన్న రాష్ర్టాలు, కేంద్ర పాలిత ప్రాంతాల కంటే ఎక్కువన్నారు.
అభివృద్ధి.. అవార్డులకు చిరునామా..
సిద్దిపేట పట్టణాన్ని అభివృద్ధ్దికి, జాతీయ స్థాయి అవార్డులకు చిరునామాగా నిలుపామని మంత్రి హరీశ్రావు అన్నారు. గతంలో సిద్దిపేట పట్టణం పందులకు ప్రసిద్ధ్దిగా ఉండేదని, నేడు అన్ని మున్సిపాలిటీలకు ఆదర్శంగా నిలిపామన్నారు. అందుకే ఇతర రాష్ర్టాల నుంచి, అనేక మున్సిపాలిటీల నుంచి ఇక్కడి వచ్చి ఇక్కడ జరిగిన అభివృద్ధి పనులను అధ్యయనం చేస్తున్నారన్నారు. క్లీన్ అండ్ గ్రీన్ సిద్దిపేటగా మార్చుకున్నామని, 2 మున్సిపల్, 1 సుడా నర్సరీలను ఏర్పాటు చేసుకొని పట్టణంలో మొక్కలు పెంచి పచ్చదనంతో నింపామన్నారు. పందుల బెడద తొలగించామని, కోతుల సమస్య లేకుండా చేస్తామన్నారు. కుక్కలతో కలిగే ఇబ్బందులను తొలగించేందుకు యానిమల్ బర్త్ కంట్రోల్ సెంటర్ను ఈ నెల 10న ప్రారంభించనున్నట్లు తెలిపారు. సిద్దిపేట పాత బస్టాండ్ను రూ.6 కోట్లతో ఆధునిక హంగులతో నిర్మించనున్నట్లు మంత్రి తెలిపారు. మున్సిపల్లో పనిచేస్తున్న 425 మంది కార్మికుల వేతనాలను పెంచినట్లు తెలిపారు. అనంతరం మున్సిపల్ చైర్మన్ రాజనర్సు మాట్లాడుతూ మంత్రి హరీశ్రావు నేతృత్వంలో సిద్దిపేట మున్సిపల్ను దేశంలో ఉత్తమంగా తీర్చిదిద్దామన్నారు. దక్షిణ భారత దేశంలోనే సిద్దిపేట మున్సిపాలిటీ అగ్రగామి ఆవిర్భవించిందన్నారు. పురపాలక సంఘానికి అనేక జాతీయ అవార్డులు వచ్చాయన్నారు.
స్వీపింగ్ ట్రాక్టర్ మిషన్లు ప్రారంభం
సిద్దిపేట ప్రదాన రహదారులను శుభ్ర పరిచేందుకు రూ.26 లక్షలతో కొనుగోలు చేసిన రెండు స్వీపింగ్ మిషన్ ట్రాక్టర్లను మంత్రి మున్సిపల్ ఆవరణలో శుక్రవారం ప్రా రంభించారు. ఈ కార్యక్రమంలో మున్సిపల్ వైస్ చైర్మన్ అక్తర్ పటేల్, మున్సిపల్ కమిషనర్ రమణాచారి, కౌన్సిలర్లు వేణుగోపాల్రెడ్డి, వెంకట్గౌడ్,వెంకట్, మల్లికార్జున్, వజీర్, జావిద్, శ్రీనివాస్, మోయిజ్, ప్రవీణ్, ప్రశాంత్, గ్యాదరి రవీందర్,చిప్ప ప్రభాకర్, నర్సయ్య,శ్రీనివాస్ యాదవ్, ఉమారాణి అయిలయ్య,పూజల లత వెంకటేశ్వరరావు, ఉమారాణీశ్రీనివాస్, విజయలక్ష్మీనరేందర్రెడ్డి, బాల్లక్ష్మీ ఆనంద్, మంజులానర్సింహులు, స్వప్నాబ్రహ్మం, లలితా రామన్న, జ్యోతీరాజనరేందర్, కవితాకనకరాజు, దీప్తీనాగరాజు, లక్ష్మీసత్యనారాయణ తదితరులు పాల్గొన్నారు.
త్వరలోనే ఎస్సీ మహిళా భవనం.. శ్మశాన వాటిక పనులు
సిద్దిపేట అర్బన్, ఏప్రిల్ 9 : లింగారెడ్డిపల్లి వార్డులోని ఎస్సీ మహిళా సంఘం భవనం అసంపూర్తి పనులు, ఎస్సీ శ్మశాన వాటిక పనులు త్వరలోనే చేపడుతామని మంత్రి హరీశ్రావు హామీ ఇచ్చారు. శుక్రవారం సిద్దిపేట మున్సిపా లిటీ పరిధి లింగారెడ్డిపల్లిలో సుడా ఆధ్వర్యంలో రూ.9.75 లక్షలతో ఏర్పాటు చేసిన ఓపెన్ జిమ్ను మంత్రి ప్రారంభించి, కాసేపు వ్యాయమం చేశారు. అనంతరం మహిళా మండలి సభ్యులకు కుర్చీలు అందజేశారు. అంతకు ముందు మహారేణుకా ఎల్లమ్మ దేవాలయ 45వ వార్షికోత్సవాలకు హాజరై, అమ్మవారికి పూజలు చేశారు.
ఇవీ కూడా చదవండి…