జగదేవ్పూర్, ఏప్రిల్ 7 : గ్రామపంచాయతీ ఉప ఎన్నికలు సజావుగా, శాంతియుతంగా నిర్వహించడానికి రాజకీయ పార్టీలు సహకరించాలని ఎంపీడీవో మల్లికార్జున్ కోరారు. బుధవారం మండల కార్యాలయంలో ఆయా పార్టీల నాయకులు, ప్రజాప్రతినిధులతో పంచాయతీ ఉప ఎన్నికల నిర్వహణపై సమావేశమయ్యారు.
ఈ సందర్భంగా ఎంపీడీవో మాట్లాడుతూ.. మండలంలోని 15 గ్రామపంచాయతీలకు పలు కారణాలతో ఉప ఎన్నికలు వచ్చినట్లు తెలిపారు. గత ఎన్నికల్లో 276 మంది అభ్యర్థులు పోటీ చేసినప్పటికీ ఎన్నికల ఖర్చు వివరాలను ఎన్నికల అధికారులకు సమర్పించలేదన్నారు. అదేవిధంగా గెలిచిన 56 మంది అభ్యర్థులు కూడా పూర్తి వివరాలు ఇవ్వకపోవడంతో వారిని అనర్హులుగా ప్రకటించినట్లు తెలిపారు. 3 గ్రామాల్లో ఇద్దరు వార్డు సభ్యులు మృతి చెందగా, మరో వ్యక్తి ఎంపీటీసీగా గెలుపొందడంతో తిరిగి ఆయా వార్డులకు ఉప ఎన్నికలు వచ్చినట్లు వివరించారు. మొత్తం 5 గ్రామాల్లోని 58 వార్డు లకు ఉప ఎన్నిక నిర్వహిస్తున్నట్లు చెప్పారు. కొందరు ఉపసర్పంచ్ ఎన్నికపై కోర్టులో స్టే తెచ్చుకున్నారని.. ఆయా వార్డులకు కోర్టు ఆదేశాల ప్రకారం నడుచుకుంటామని తెలిపారు. పంచాయతీ వార్డు ఎన్నికలో పోటీ చేసే అభ్యర్థులు పూర్తి ధ్రువపత్రాలు, నామినేషన్ ప త్రాలను సరైన పద్ధ్దతిలో అందజేయాలని, ఎన్నికల కమిషన్ ఆదేశాలకు అనుగుణంగా ఎన్నికల ఖర్చు చేయాలని సూచించారు. సమా వేశంలో ఎంపీపీ బాలేశంగౌడ్, జడ్పీటీసీ సుధాకర్రెడ్డి, ఎంపీవో శ్రీనివాసవర్మ, ఆయా గ్రామాల సర్పంచ్లు, ఎంపీటీసీలు పాల్గొన్నారు.
కోర్టు తీర్పు వచ్చేవరకు వాయిదా వేయాలి
కోర్టు తీర్పు వచ్చేవరకు ఉప ఎన్నికను వాయిదా వేయాలని మునిగడప గ్రామ వార్డు సభ్యులు ఎంపీవో శ్రీనివాసవర్మకు వినతిపత్రం అందజేశారు. స్థానికులు ముచ్చపతి కవిత, కొత్తపల్లి వ్యామల, దొమ్మాటసత్యనారాయణ, వెంకట్నారాయణ, నర్ర స్వామి, బొగ్గుల సంతోష పంచాయతీ ఎన్నికల్లో వార్డు సభ్యులుగా గెలిచినప్పటికీ ఎన్నికల ఖర్చు వివరాలు ఇవ్వలేదని అనర్హులుగా ప్రకటిస్తూ ఎన్నికల కమిషన్ ఉత్తర్వులు జారీ చేసింది. దీనిపై హైకోర్టుకు వెళ్లి స్టే తెచ్చుకున్నారు. ఉత్తర్వులు వచ్చేవరకు మునిగడపలో ఉపఎన్నిక వాయిదా వేయాలని కోరారు.
ఇవీ కూడా చదవండీ…