నంగునూరు, జూన్ 5 : ప్రభుత్వం వ్యవసాయ రంగానికి పెద్దపీట వేస్తూ బడ్జెట్లో అధిక నిధులు కేటాయించి రైతులను అన్ని విధాలా ప్రోత్సహిస్తున్నదని ఆర్థిక శాఖ మంత్రి హరీశ్రావు అన్నారు. శనివారం నం గునూరులో వ్యవసాయ మా ర్కెట్ కమిటీ పాలకవర్గం ప్రమా ణ స్వీకారోత్సవానికి ముఖ్య అతిథిగా ఆయన హాజరై మాట్లాడుతూ.. వ్యవసాయ మార్కెట్ కమిటీ నూతన చైర్మన్ రాగుల సారయ్య అందరితో కలుపుగోలుగా ఉండి బాగా పనిచేస్తాడన్నారు. గతంలో ఎంపీపీగా, ఉమ్మడి జిల్లా జడ్పీ వైస్ చైర్మన్గా ప్రజలకు మంచి సేవలందించారన్నారు. పాలకవర్గం రైతులకు ఎలాంటి ఇబ్బందులు లేకుండా చూడాలన్నారు. మార్కెట్ అభివృద్ధికి కృషి చేయాలని సూచించారు. రైతులు ఆయిల్పామ్ సాగుకు ముందుకు రావాలని కోరారు. భవిష్యత్తులో సిద్దన్నపేట మార్కెట్ను మరింత అభివృద్ధి చేస్తానన్నారు. అనంతరం లబ్ధిదారులకు మంత్రి హరీశ్రావు కల్యాణలక్ష్మి చెక్కులను పంపిణీ చేశారు. నూతన పాలకవర్గాన్ని ఆయా గ్రామాల సర్పంచ్లు, ఎంపీటీసీలు, నాయకులు శుభాకాంక్షలు తెలిపి సన్మానించారు. కార్యక్రమంలో జడ్పీ చైర్పర్సన్ రోజాశర్మ, మాజీ ఎంపీపీ జాప శ్రీకాంత్రెడ్డి, సిద్దిపేట మార్కెట్ కమిటీ చైర్మన్ పాల సాయిరాం, రైతుబంధు జిల్లా అధ్యక్షుడు నాగిరెడ్డి, రైతుబంధు మండల అధ్యక్షుడు కిష్టారెడ్డి, సీనియర్ నాయకులు వేముల వెంకట్రెడ్డి, మల్లయ్య, పురేందర్, సోంరెడ్డి, టీఆర్ఎస్ మండల అధ్యక్షుడు లింగంగౌడ్, మార్కెట్ సెక్రటరీ పరమేశ్వర్ పాల్గొన్నారు.