కరోనాపై వినూత్న ప్రచారం
ఊరూరా అవగాహన కల్పిస్తున్న సీఎం వీరాభిమాని
మర్కూక్, జూన్ 5 : కరోనా మహమ్మారిపై గ్రామాల్లో విస్తృత అవగాహన కల్పించేందుకు రామాపతాప్ అనే వ్యక్తి వినూత్న ప్రచారానికి శ్రీకారం చుట్టారు. కరోనా వస్తే భయపడవద్దని, కరోనాకు మనోధైర్యమే మందు అని చెబుతున్నాడు. శనివారం హైదరాబాద్కు చెందిన రామాపత్రాప్ మండలంలోని పలు గ్రామాల్లో అవగాహన కల్పించాడు. ప్రస్తుతం ఆరోగ్యశాఖను సీఎం కేసీఆర్ పర్యవేక్షిస్తూ, నిరంతరం అధికారులకు సూచనలు చేస్తూ, కరోనా కట్టడిలో తీసుకుంటున్న చర్యలు ఆమోగమని తెలిపారు. కార్యక్రమంలో సర్పంచ్ మొండి భాగ్యభిక్షపతి, వరదరాజ్పూర్ సర్పంచ్ అప్పాల ప్రవీన్ పాల్గొన్నారు.