రాయపోల్, ఏప్రిల్ 2 : రైతును రాజు చేయడమే లక్ష్యంగా తెలంగాణ సర్కారు ముందుకు వెళ్తున్నదని, వారి సమస్యలు పరిష్కరించేలా చేయూతనందించేందుకు ప్రతి గ్రామంలో రైతు వేదికలు నిర్మిస్తున్నదని మెదక్ ఎంపీ కొత్త ప్రభాకర్రెడ్డి పేర్కొన్నారు. శుక్రవారం రాయపోల్ మండలం వడ్డేపల్లి, చిన్నమాసాన్పల్లి, పెద్ద ఆరెపల్లి, రాయపోల్ గ్రామాల్లో దుబ్బాక ఎమ్మెల్యే, జడ్పీ అధ్యక్షురాలు రోజాశర్మతో కలిసి నాలుగు రైతు వేదికలను ఆయన ప్రారంభించారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన సమావేశంలో ఎంపీ మాట్లాడారు. రైతు సంక్షేమం కోసం ప్రభుత్వం ఎన్నో సంక్షేమ కార్యక్రమాలను చేపట్టిందన్నారు. రైతుల అభివృద్ధికి సీఎం కేసీఆర్ అన్నిరంగాల్లో పెద్దపీట వేస్తున్నట్లు ఆయన స్పష్టం చేశారు. మారుతున్న కాలానికి అనుగుణంగా వ్యవసాయ రంగంలో పలు మార్పులు వస్తున్నాయన్నారు.
రైతు వేదికల ద్వారా రైతులకు ఉపయోపడే సూచనలు, సలహాలు అందుతాయన్నారు. యాసంగిలో రైతులు సాగు చేసిన ధాన్యాన్ని గ్రామాల్లోనే కొంటామని, రైతుకు గిట్టుబాటు ధరను కల్పించడమే ప్రభుత్వ లక్ష్యమన్నారు. గతంలో ఏప్పుడు లేని విధంగా రైతులకు అన్నిరంగాల్లో పెద్దపీట వేస్తున్న ఘనత సీఎం కేసీఆర్కే దక్కిందన్నారు. వ్యవసాయనికి సాగు నీరు అందించేందుకు ప్రాజెక్టులు నిర్మించారన్నారు. గోదావరి నీటిని కూడవెల్లి వాగులోకి మళ్లించడంతో ఎండకాలంలోనూ చెరువులు, చెక్డ్యాంలు మత్తళ్లు దూకుతున్నాయన్నారు. గోదావరి నీటినితో మిగతా ప్రాంతాలకు తరలించేందుకు కాలువలు నిర్మిస్తున్నట్లు చెప్పారు. ఈ కార్యక్రమంలో ఎంపీపీ కల్లూరి అనిత శ్రీనివాస్, జడ్పీటీసీ యాదగిరి, మార్కెట్ కమిటీ చైర్మన్ శ్రీనివాస్గుప్తా, రైతు బంధు సమితి ,మండలాధ్యక్షుడు నర్సింహారెడ్డి, వైస్ ఎంపీపీ రాజిరెడ్డి తదితరులు పాల్గొన్నారు.
బాధిత కుటుంబాలను పరామర్శ
కొత్తపల్లికి చెందిన మంద ప్రవీణ్, డేవిద్ రోడ్డు ప్రమాదంలో మృతి చెందగా, బాధిత కుటుంబాన్ని ఎంపీ కొత్త ప్రభాకర్రెడ్డి పరామర్శించారు. కుటుంబాన్ని ఓదార్చి ఆర్థిక సాయం చేశారు. మండలంలోని వడ్డేపల్లి మాజీ ఎంపీటీపీ యాదగిరి రెండు రోజుల కింద మృతి చెందగా, కుటుంబీకులను ఓదార్చారు. బాధిత కుటుంబాలను ప్రభుత్వ పరంగా ఆదుకుంటామన్నారు.
ఇవీ కూడా చదవండి..
పాములు, ఎలుకలు, పిల్లుల వల్ల.. లక్షా 30 వేల కోట్ల డాలర్ల నష్టం
లింగ సమానత్వంలో అట్టడుగులో భారత్.. ఐస్లాండ్కు తొలిస్థానం
22 మమ్మీలతో కైరో వీధుల్లో పరేడ్
హిమాలయాల్లో 2 టన్నుల చెత్త.. సేకరించిన నేపాల్ పర్వతారోహకులు
కుక్క కోసం బస్సు ఆపిన డ్రైవర్.. వీడియో వైరల్