తొగుట, ఏప్రిల్ 1 : పల్లె ప్రగతిని తొగుట మండలం ఎల్లారెడ్డిపేట గ్రామం సద్వినియోగం చేసుకుంటున్నది. సర్పంచ్ సిరినేని గోవర్ధన్, ఎంపీటీసీ వెల్పుల స్వామి నాయకత్వంలో అభివృద్ధిలో దూసుకెళ్తున్నది. సుమారు రూ.6.24లక్షలతో ఏర్పాటు చేసిన పల్లె ప్రకృతి వనం ఆకట్టుకుంటున్నది. రూ.2.60లక్షలతో డంపింగ్ యార్డు, రూ.76వేలతో 25వేల మొక్కల సామర్థ్యంతో నర్సరీని, రూ.1.26లక్షలతో వైకుంఠధామం పూర్తయ్యింది. ఇంటింటికి తాగునీరు అందించడానికి మూడేళ్ల కింద 90వేల లీటర్ల సామర్థ్యంతో నూతనంగా ఓవర్ హెడ్ ట్యాంక్ నిర్మించారు. ఇప్పటికే గ్రామంలో లక్షా 40 వేల లీటర్ల సామర్థ్యం గల మూడు ఓవర్ హెడ్ ట్యాంకులున్నాయి. వీటి ద్వారా మిషన్ భగీరథ నీళ్లు సరఫరా చేస్తుండడంతో గ్రామస్తుల తాగునీటి కష్టాలు తీరాయి. గ్రామంలోని పీహెచ్సీ సబ్ సెంటర్తో గ్రామస్తులకు వైద్యసేవలు అందుతున్నాయి.
గ్రామంలోని హైస్కూల్ పచ్చని చెట్లతో ప్రకృతి ఒడిని తలపించేలా ఉంది. పంచాయతీ నుంచి ప్రజలకు సమాచారం అందించేందుకు వాడవాడకు రూ.2.50లక్షలతో 25 మైక్లను ఏర్పాటు చేశారు. గతంలోనే నిఘా వ్యవస్థ కోసం సీసీ కెమెరాలు ఏర్పాటు చేశారు. పంచాయతీ నిధులతో ట్రాక్టర్, ట్రాలీ, ట్యాంకర్, రోటవేటర్ సమకూర్చుకున్నారు. గ్రామంలో శిథిలావస్థకు చేరిన 50ఇండ్లను కూల్చివేశారు. నాలుగు పాడుబడ్డ బావులను పూడ్చారు. గ్రామంలో 25 డబుల్ బెడ్రూం ఇండ్లు నిర్మించారు. కరోనా మూలంగా ప్రజలకు మాస్కులు, శానిటైజర్లు పంచారు. ఇంటింటికీ చెత్త బుట్టల పంపిణీ చేసి, తడి, పొడి చెత్తపై అవగాహన కల్పించారు. వీధివీధినా ఎల్ఈడీ స్ట్రీట్లైట్లు పెట్టారు. కొత్త పంచాయతీ భవనం నిర్మాణానికి రూ.13లక్షలు, సీసీ రోడ్లకు రూ.5లక్షలు మంజూరు కాగా, త్వరలో పనులు చేపట్టనున్నారు.
చాలా సంతోషంగా ఉంది
కొత్త పంచాయతీ రాజ్ చట్టం మూలంగా పెద్ద ఎత్తున నిధులు రావడంతో గ్రామంలో అభివృద్ధి పనులు వేగంగా సాగుతున్నాయి. మౌలిక సదుపాయాలకు పెద్దపీట వేస్తున్నాం. కొత్తగా మురుగు నీటి కాల్వల నిర్మాణం జరుగుతున్నది. రాబోయే రోజుల్లో మరింత అభివృద్ధి జరుగనున్నది.
కొత్త చట్టంతో ఎంతో మేలు
నిధుల లేమితో గతంలో పంచాయతీల అభివృద్ధి కుంటు పడేది. సీఎం కేసీఆర్ గ్రామాల సమగ్రాభివృద్ధికి కొత్త పంచాయతీ రాజ్ చట్టం తీసుకురావడంతో కేం ద్రానికి దీటుగా రాష్ట్రం నుంచి నిధులు అందుతున్నాయి. గ్రామాల్లో మౌలిక వసతులు కల్పించడంతో పాటు అభివృద్ధిలో ఎల్లారెడ్డిపేట దూసుకెళ్తున్నది.
ఇవీ కూడా చదవండీ..
గే న్యాయవాది.. హైకోర్టు జడ్జిగా ఉండొద్దా?
పాన్-ఆధార్ అనుసంధానం గడువు 3 నెలలు పొడిగింపు