సిద్దిపేట : సిద్దిపేట జిల్లాకు చెందిన ఐదుగురు క్రీడాకారులు జాతీయ సాఫ్ట్బాల్ పోటీలకు ఎంపికయ్యారని సిద్దిపేట జిల్లా అసోసియేషన్ అధ్యక్షుడు నేతి కైలాసం, ప్రధాన కార్యదర్శి రేణుక తెలిపారు. బుధవారం వారు మాట్లాడుతూ జూనియర్ బాలికల జాతీయ సాఫ్ట్బాల్ పోటీలు ఈ నెల 26 నుంచి 39 వరకు లవ్లీ ప్రొఫెషనల్ యూనివర్సిటీ, పగ్వారా పంజాబ్ రాష్ట్రంలో జరుగుతున్నాయని వెల్లడించారు. ఈ పోటీల్లో టీఎస్డబ్ల్యూఆర్ఎస్ ములుగు పాఠశాలకు చెందిన విద్యార్థులు ప్రియాంక, స్వప్న, రెబెకా, వైష్ణవి, జోష్నవి పాల్గొననున్నట్లు తెలిపారు.
వీరికి ఒక్కొక్కరికి రూ.2 వేల చొప్పున మొత్తం రూ.10 వేలు అందించామని తెలిపారు. విద్యార్థులను ప్రిన్సిపల్ కల్పన, వ్యాయామ ఉపాధ్యాయులు రేణుక ప్రోత్సహిస్తున్నారన్నారు. జాతీయ స్థాయిలో ఉత్తమ ప్రతిభ కనబర్చి పతకాలతో తిరిగి రావాలన్నారు. కార్యక్రమంలో సభ్యులు రాజు, సిద్దిపేట జిల్లా స్కూల్గేమ్స్ ఫెడరేషన్ కార్యదర్శి గ్యాదరి భిక్షపతి పాల్గొని అభినందనలు తెలిపారు.