మాజీ ఎమ్మెల్యే చింతా ప్రభాకర్
సంగారెడ్డి, ఆగస్టు 5: నిజాం నిరంకుశ పాలనలో వెట్టిచాకిరి చేస్తున్న పేద ప్రజలకు విముక్తి కలిగించి, నిజాం పాలనకు వ్యతిరేకంగా పోరాటం చేసిన ఉద్యమ మహిళా నాయకురాలు చాకలి ఐలమ్మ అని మాజీ ఎమ్మెల్యే చింతా ప్రభాకర్ అన్నారు. గురువారం కొండాపూర్ మండలం మునిదేవునిపల్లి గ్రామంలో చాకలి ఐలమ్మ విగ్రహాన్ని ఆయన ఆవిష్కరించారు. ఈసందర్భంగా ఆయన మాట్లాడుతూ నిజాం పాలనలో ప్రజలను పీడిస్తున్న పాలనకు వ్యతిరేకంగా పోరాటం చేసి పాలకుల ద్వంద వైఖరిపై పోరాటం చేసి పేద ప్రజలకు అండగా నిలిచిందన్నారు. ఆమె పోరాటం వృథా కాలేదని అప్పట్లో స్వాతంత్య్రం కోసం సాయుధ పోరాటం చేసి మహిళా ఉద్యమకారినిగా గుర్తుంపు సాధించారన్నారు.
నిజాం పాలకులపై మొదలు పెట్టిన ఉద్యమం తొలిదశ తెలంగాణ పోరాటానికి బాటలు పడ్డాయని, ఐలమ్మ పోరాటాన్ని కొనసాగిస్తూ తెలంగాణ ఉద్యమంలో కీలక పాత్రతో ఉద్యమాన్ని సాగించారన్నారు. స్వరాష్ట్ర ఉద్యమం చేస్తున్న ఉద్యమకారులు నిజాం పాలనపై చేస్తున్న ఐలమ్మ పోరటానికి మద్దతు పలికి తోడుగా నిలిచారన్నారు. కార్యక్రమంలో ఎంపీపీ మనోజ్రెడ్డి, ఎంపీపీ ఉపాధ్యక్షురాలు లక్ష్మీ రాంచందర్, సర్పంచ్ అండాలమ్మ, ఉపసర్పంచ్ కృష్ణ, మాజీ సర్పంచ్, ఎంపీటీసీ పెంటల మల్లేశం, రజక సంఘం జిల్లా అధ్యక్షుడు నామాల నాగేశ్, కరీంనగర్ జిల్లా అధ్యక్షుడు దుబ్బాక రమేశ్, నాయకులు పట్లోళ్ల బుచ్చిరెడ్డి, సుధీర్రెడ్డి, మల్లారెడ్డి, టీఆర్ఎస్ మండల పార్టీ అధ్యక్షుడు మల్లేశం, సామ్రాట్ గోవర్దన్, టీఆర్ఎస్ నాయకులు, కార్యకర్తలు, రజక సంఘం నాయకులు తదితరులు పాల్గొన్నారు.
మనిదేవునిపల్లిలో
కొండాపూర్,ఆగస్టు 5: చాకలి ఐలమ్మ సేవలు మరవలేనివని సంగారెడ్డి మాజీ ఎమ్మెల్యే చింతా ప్రభాకర్ పేర్కొన్నారు. మనిదేవునిపల్లి గ్రామంలో చాకలి ఐలమ్మ విగ్రహాన్ని ఆయన ఆవిష్కరించారు. ప్రతి ఒక్కరూ ఐలమ్మ బాటలో నడవాలని సుచించారు. కార్యక్రమంలో ఎంపీపీ పి.మనోజ్రెడ్డి, మాజీ సర్పంచ్ రాంచందర్, మాజీ ఉపసర్పంచ్ మల్లారెడ్డి, నాయకులు గోవర్దన్ పాల్గొన్నారు.