ఎమ్మెల్యే పద్మాదేవేందర్రెడ్డి
కొత్తపల్లి అనంతపద్మనాభస్వామి కల్యాణానికి పట్టువస్త్రాలు సమర్పణ, ప్రత్యేక పూజలు
పాపన్నపేట, మార్చి 29: తెలంగాణ ప్రభుత్వం ఆలయాల అభివృద్ధికి పెద్దపీట వేస్తున్నదని మెదక్ ఎమ్మెల్యే పద్మాదేవేందర్రెడ్డి అన్నారు. మండల పరిధిలోని కొత్తపల్లిలో సోమవారం అనంతపద్మనాభస్వామి కల్యాణ మహోత్సవాన్ని వైభవంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ఎమ్మెల్యే పద్మాదేవేందర్రెడ్డి హాజరై స్వామివారికి పట్టువస్ర్తాలు, ఒడిబియ్యం సమర్పించారు. అనంతరం ఆలయంలో స్వామివారికి ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ పద్మనాభ స్వామి ఆలయంలో రూ.10 లక్షలతో కల్యాణ మండపం నిర్మిస్తామని గతంలోనే హామీ ఇచ్చానని, కరోనా కారణంగా ఆలస్యం అయ్యిందని, త్వరలోనే ఇచ్చిన హామీని నెరవేర్చుకుంటామన్నారు. స్వామివారి వేడుకలను వైభవంగా నిర్వహిస్తున్న సర్పంచ్ కుమ్మరి జగన్ను ఆమె అభినందించారు. కాగా, కల్యాణ వేడుకకు భక్తులు పెద్ద ఎత్తున తరలిరాగా, ఆలయ ప్రాంగణంలో అన్నదానం నిర్వహించారు. కార్యక్రమంలో జడ్పీ వైస్ చైర్పర్సన్ లావణ్యరెడ్డి, పాపన్నపేట ఎంపీపీ చందనరెడ్డి, జిల్లా రైతు సమన్వయసమితి అధ్యక్షుడు తాడేపు సోములు, సర్పంచ్ల ఫోరం మాజీ మండలాధ్యక్షుడు చావా పాపారావు, ఆలయ కమిటీ అధ్యక్షుడు సందీప్ తదితరులు పాల్గొన్నారు. తొగుట పీఠాధిపతి మాధవానంద సరస్వతి స్వామి పద్మనాభ స్వామి వారిని దర్శించుకొని ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఏడుపాయల ఆలయం సిబ్బంది తరఫున సైతం స్వామివారికి పట్టు వస్ర్తాలు సమర్పించారు. కాగా, నేడు రథోత్సవ కార్యక్రమంతో జాతర ముగియనున్నది.
ఇవి కూడా చదవండి
అంజీర్ పండ్లతో శృంగార సమస్యలకు చెక్..!